దేశంలో కొత్త కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 46,951 మందికి కరోనా నిర్ధారణ అయింది. కరోనా సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు నైట్ కర్ప్యూ, వారాంతం లాక్ డౌన్ కూడా ప్రకటించాయి. ఇప్పుడు కరోనా మళ్లీ సామాన్యుల నుంచి సెలబ్రెటల వరకు ఎవ్వరినీ వదలడం లేదు. పలువురు రాజకీయవేత్తలు, సెలబ్రిటీలు, క్రీడాకారులు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు.
తాజాగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ కు కరోనా సోకింది.తనకు నిర్వహించిన కరోనా టెస్టులో పాజిటివ్ అని తేలిందని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు.డాక్టర్లు తన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారని అన్నారు. ఇటీవలి కాలంతో తనకు కాంటాక్ట్ లోకి వచ్చిన వచ్చిన వారంతా కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని కోరారు.
రాజస్థాన్ లో దారుణం.. ఆడుకుంటూ వెళ్లి 8 మందిచిన్నారులు మృతి!