పశ్చిమబెంగాల్ కార్మిక శాఖ మంత్రి జాకీర్ హుసేన్పై గుర్తుతెలియని వ్యక్తులు క్రూడ్ బాంబులతో దాడి చేశారు. దీంతో మంత్రితోపాటు ఆయన అల్లుడు, జంగీపూర్ ఎమ్మెల్యే, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గత రాత్రి 10 గంటల సమయంలో కోల్కతా వెళ్లేందుకు ముర్షిదాబాద్ జిల్లాలోని నిమ్తితా రైల్వే స్టేషన్లో మంత్రి వేచి చూస్తున్నారు.
ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కొందరు ఆయనపై బాంబులు విసిరారు. బాంబు పేలుళ్లతో రైల్వే స్టేషన్ దద్దరిల్లింది. ప్రయాణికులు, రైల్వే సిబ్బంది భయంతో పరుగులు తీశారు.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మంత్రిని జంగీపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ దాడిలో కాళ్లు, అంతర్గత భాగాలకు గాయాలయ్యాయని చెప్పారు. మంత్రి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బంగారం కొనేవారికి శుభవార్త.. తగ్గిన బంగారం.. అదేబాటలో వెండి!