ఆళ్లగడ్డ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మంత్రి అఖిల, సుబ్బారెడ్డి మధ్య బేధాలు రాళ్లదాడి చేసుకొనేంత స్టేజీకీ వెల్లింది. సైకిల్ యాత్ర నిర్వహిస్తున్న ఏవీ సుబ్బారెడ్డిపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లవిసరడంతో పరిస్థితులుఉద్రిక్తంగా మారాయి. అఖిలప్రియ వర్గీయులే దాడి చేయించారని సుబ్బారెడ్డి ఆరోపించిన సంగతి తెలసిందే.
అయితే అఖిలకు ధీటుగా తన కూతురు జశ్వంతి రెడ్డిని రంగంలోకి దింపారు. తాజాగా జశ్వంతి రెడ్డి ఆఖిలపై సంచలన ఆరోపనలు చేసింది. తన తండ్రికి ఏం జరిగినా దానికి బాధ్యత వహించాలన్నారు. అఖిలప్రియ తన వాహనాలపై భూమా స్టిక్కర్ తీసివేసి మంత్రి అఖిలప్రియగా పెట్టుకోవాలని ఆమె సూచించారు. ‘మా నాన్న భూమా నాగిరెడ్డి కుటుంబానికి ఎంతో సేవ చేశాడు. ర్యాలీ సందర్భంగా నాన్నపై దాడి జరగడం చాలా బాధ కలిగించిందన్నారు.
ఆళ్లగడ్డలో వర్గపోరు తారాస్థాయికి చేరుకున్న విషయం విదితమే. పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ, టీడీపీ నేత, భూమా నాగిరెడ్డి సన్నిహితుడు ఏవీ సుబ్బారెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. దాడి చేసిన దుండుగులను ఇప్పటి వరకు పోలీసులు ఎందుకు పట్టుకోలేదని సుబ్బారెడ్డి పోలీసులను ప్రశ్నించారు. రాళ్లదాడికి కారకులైన మంత్రి అఖిలప్రియపై కేసు ఎందుకు నమోదు చేయలేదన్నారు. ఈ కేసును నీరుగార్చడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇప్పుడు వ్యూహాత్మకంగానే సుబ్బారెడ్డి తన కూతురును రంగంలోకి దించారనే వార్తలు వినిపిస్తున్నాయి.