Friday, April 26, 2024
- Advertisement -

తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు!

- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గత 24 గంటల్లో కొత్త‌గా 493 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం… ఒక్క‌రోజులో కరోనాతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 157  మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ నమోదైన కరోనా కేసుల సంఖ్య 3,04,791కి చేరింది. 

ఇందులో 3684 యాక్టివ్ కేసులు ఉండగా.. 2,99,427 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య 1680గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 3,684 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 1,616 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటు న్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 138 మందికి క‌రోనా సోకింది. ఇక తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటివరకు 98,45,577 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

‘కార్తికేయ-2’ షూటింగ్ కొత్త కష్టాలు!

కరోనా టీకా వేయించుకున్న కండల వీరుడు!

దుస్తులు తెల్ల‌గా మెరిసే చిట్కాలివిగో !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -