Thursday, April 25, 2024
- Advertisement -

కేసీఆర్​ ఫామ్​హౌస్​ ఎక్కడో కూడా తెలియదు..!

- Advertisement -

తెలంగాణ బీజేపీ నేత పెద్దిరెడ్డి.. ఈటల రాజేందర్​ తమ పార్టీలో చేరడాన్ని మొదట్లో తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. పెద్దిరెడ్డి చాలా కాలం క్రితమే.. టీడీపీ నుంచి బీజేపీలో చేరారు. ఆయనకు ఆ పార్టీలో ఎటువంటి ప్రాధాన్యం ఉందో? ఆయన కు ఉన్న పదవి ఏమిటో కూడా ప్రజలు మరిచిపోయారు. ప్రెస్​మీట్లలోనూ ఆయన పెద్దగా కనిపించరు.

ఇక పోతే ఆయన సొంత నియోజవర్గం హుజూరాబాద్​.. గతంలో అక్కడి నుంచి చాలా సార్లు పోటీచేశారు. దీంతో సహజంగానే ఆయన ఈటల రాజేందర్​ రాకను వ్యతిరేకించారు. తనను సంప్రదించకుండా ఈటలను ఎలా చేర్చుకుంటారంటూ మండిపడ్డారు. ఈటల బీజేపీలో చేరితే ఉప్పెన తప్పదని పెద్ద పెద్ద స్టేట్​మెంట్లు ఇచ్చారు. ఇదిలా ఉండగానే ఈటల బీజేపీలో చేరిపోయారు. ఆయనకు అంతా బీజేపీ పెద్దలు కండువాలు కప్పారు. ఇక పెద్దిరెడ్డిని అంతా మరిచిపోయారు.

ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి ఫామ్​హౌస్​లో కేసీఆర్ ను కలిశారని.. ఆయన టీఆర్​ఎస్​ లో చేరబోతున్నారని వార్తలు వచ్చాయి. దీంతో పెద్దిరెడ్డి మళ్లీ లైన్​లోకి వచ్చారు. ఈటల చేరికపై ఈ సారి సాఫ్ట్​గా మాట్లాడారు.. ’ ఈటల రాజేందర్​ పార్టీలో చేరితే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఇక హుజురాబాద్ లో ఎవరు పోటీచేయాలన్న విషయం హైకమాండ్​ నిర్ణయిస్తుంది.

నేను కేసీఆర్ ఫామ్​ హౌస్​ కి వెళ్లడం వట్టి అసత్య ప్రచారం.. నాకు కేసీఆర్​ ఫామ్​ హౌస్​ ఎక్కడ ఉందో కూడా తెలియదు. నేను పార్టీ మారే ప్రసక్తే లేదు’ అంటూ క్లారిటీ ఇచ్చారు పెద్దిరెడ్డి. ఈటల రాకతో పార్టీలో అసంతృప్తి చెలరేగిందన్న వార్తల నేపథ్యంలో .. పెద్దిరెడ్డి టీఆర్ఎస్​ లో చేరబోతున్నారని వార్తలు వినిపించిన క్రమంలో ఆయన వివరణ ఇచ్చుకున్నారు.

Also Read

ఈటల రాజేందర్‌పై మావోయిస్టు నేత ఘాటు లేఖ

హుజూర్ నగర్ పర్యటనలో వైఎస్ షర్మిలకు షాక్..!

లోకేష్ బాబు ముద్ద పప్పు.. అందరూ ఆయనలా కావాలా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -