తెలంగాణ బీజేపీ నేత పెద్దిరెడ్డి.. ఈటల రాజేందర్ తమ పార్టీలో చేరడాన్ని మొదట్లో తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. పెద్దిరెడ్డి చాలా కాలం క్రితమే.. టీడీపీ నుంచి బీజేపీలో చేరారు. ఆయనకు ఆ పార్టీలో ఎటువంటి ప్రాధాన్యం ఉందో? ఆయన కు ఉన్న పదవి ఏమిటో కూడా ప్రజలు మరిచిపోయారు. ప్రెస్మీట్లలోనూ ఆయన పెద్దగా కనిపించరు.
ఇక పోతే ఆయన సొంత నియోజవర్గం హుజూరాబాద్.. గతంలో అక్కడి నుంచి చాలా సార్లు పోటీచేశారు. దీంతో సహజంగానే ఆయన ఈటల రాజేందర్ రాకను వ్యతిరేకించారు. తనను సంప్రదించకుండా ఈటలను ఎలా చేర్చుకుంటారంటూ మండిపడ్డారు. ఈటల బీజేపీలో చేరితే ఉప్పెన తప్పదని పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చారు. ఇదిలా ఉండగానే ఈటల బీజేపీలో చేరిపోయారు. ఆయనకు అంతా బీజేపీ పెద్దలు కండువాలు కప్పారు. ఇక పెద్దిరెడ్డిని అంతా మరిచిపోయారు.
ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి ఫామ్హౌస్లో కేసీఆర్ ను కలిశారని.. ఆయన టీఆర్ఎస్ లో చేరబోతున్నారని వార్తలు వచ్చాయి. దీంతో పెద్దిరెడ్డి మళ్లీ లైన్లోకి వచ్చారు. ఈటల చేరికపై ఈ సారి సాఫ్ట్గా మాట్లాడారు.. ’ ఈటల రాజేందర్ పార్టీలో చేరితే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఇక హుజురాబాద్ లో ఎవరు పోటీచేయాలన్న విషయం హైకమాండ్ నిర్ణయిస్తుంది.
నేను కేసీఆర్ ఫామ్ హౌస్ కి వెళ్లడం వట్టి అసత్య ప్రచారం.. నాకు కేసీఆర్ ఫామ్ హౌస్ ఎక్కడ ఉందో కూడా తెలియదు. నేను పార్టీ మారే ప్రసక్తే లేదు’ అంటూ క్లారిటీ ఇచ్చారు పెద్దిరెడ్డి. ఈటల రాకతో పార్టీలో అసంతృప్తి చెలరేగిందన్న వార్తల నేపథ్యంలో .. పెద్దిరెడ్డి టీఆర్ఎస్ లో చేరబోతున్నారని వార్తలు వినిపించిన క్రమంలో ఆయన వివరణ ఇచ్చుకున్నారు.
Also Read
ఈటల రాజేందర్పై మావోయిస్టు నేత ఘాటు లేఖ