Monday, April 29, 2024
- Advertisement -

పవన్ నాయకుడా.. విధిరౌడీనా .. జగన్ స్ట్రాంగ్ కౌంటర్ !

- Advertisement -

ప్రస్తుతం ఏపీలో అధికార వైసీపీ మరియు జనసేన మద్య రాజకీయ వేడి తారస్థాయిలో కొనసాగుతోంది. విశాఖ ఘటన తరువాత మంగళగిరి వేధికగా అధికార వైసీపీ పార్టీ నేతలపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. ” ప్యాకేజ్ స్టార్ అంటే చెప్పుతో కొడతా.. కోడకల్లారా.. ” దారుణమైన పదాలతో తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు పవన్. అంతే కాకుండా తన మూడు పెళ్లిళ్ల విషయంలో కూడా పవన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ” విడాకులతో పాటు నష్టపరిహారం ఇచ్చిన తరువాతే మూడు పెళ్లిళ్లు చేసుకున్నానని, మీరు చేసుకోండీ అంటూ పవన్ వైసీపీ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ..

అంతే కాకుండా ” ఒక్క పెళ్లి చేసుకొని 30 మంది స్టేపినీలతో తిరిగితే.. ఒకేనా ” అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా పవన్ వ్యాఖ్యలపై సి‌ఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్ వేశారు. అవనిగడ్డలో ఏర్పాటు చేసిన సభలో సి‌ఎం జగన్ మాట్లాడుతూ ” తాము అధివృద్ది కోసం మూడు రాజధానుల దిశగా అడుగులు వెస్తుంటే.. మూడు రాజధానులతో అభివృద్ది జరగదని, మూడు పెళ్లిళ్లతోనే మేలు జరుగుతుందని దత్తపుత్రుడు అన్నడంటూ పవన్ పై వ్యంగ్యస్త్రాలు సంధించారు వైఎస్ జగన్. ఇలా పెళ్లిళ్లు చేసుకుంటూ వదిలేస్తూ పోతే ఆడవాళ్ళకు రక్షణ ఎక్కడుంది అంటూ జగన్ ప్రశ్నించారు. భూతులు మాట్లాడడంలో పవన్ విధిరౌడిని మించిపోయాడని, ఇలాంటి వారు నాయకుడిగా చెప్పుకుంటున్నారని పవన్ పై సి‌ఎం జగన్ విరుచుకుపడ్డారు.

ఇవి కూడా చదవండి

జగన్ కు భవిష్యత్త్ ప్రత్యర్థి పవనే ?

జగనన్న” సినిమా “.. అదిరిపోయే ప్లాన్ ?

కక్ష్య రాజకీయాలు.. ప్రజల షాక్ ఎవరికి ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -