Saturday, April 20, 2024
- Advertisement -

కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్​రెడ్డి తీసుకున్న టీకా కంపెనీ పేరు తెలుసా..!

- Advertisement -

దేశవ్యాప్తంగా పదివేల ప్రభుత్వ కేంద్రాల్లో కరోనా వ్యాక్సినేషన్​కు ఏర్పాట్లు చేశామని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్​రెడ్డి తెలిపారు. నిన్న కొన్ని కేంద్రాల్లో టీకా పంపిణీ జరిగిందని.. నేటి నుంచి పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్​ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఇరవై వేల కేంద్రాల్లో వ్యాక్సిన్​ పంపిణీ చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఇవాళ ఉదయం హైదరాబాద్​ గాంధీ ఆస్పత్రిలో భారత్​ బయోటెక్​కు చెందిన కొవాగ్జిన్​ టీకా తొలి డోసును కిషన్​రెడ్డి తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్​ పాల్గొన్నారు.

తెలంగాణలోనూ 45 ప్రభుత్వ ఆస్పత్రుల్లో 91 ఉచిత కొవిడ్​ వాక్సినేషన్​ ప్రారంభించినట్లు తెలిపారు. 46 ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ కరోనా టీకా ఇస్తున్నట్లు పేర్కొన్నారు.అరవై ఏళ్లు పైబడిన, 45 సంవత్సరాలు నిండిన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు తక్షణమే వ్యాక్సిన్​ తీసుకోవాలని సూచించారు. వ్యాక్సినేషన్​ తర్వాత కొవిడ్​ నియంత్రణ చర్యలను పాటించాలని సూచించారు.

సోమవారం రాష్ట్ర వైద్యోరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్​ టీకా తీసుకున్నారని.. ఇవాళ తాను కొవాగ్జిన్​ టీకాను వేసుకున్నట్లు తెలిపారు. కొవిడ్​ వ్యాక్సినేషన్​ పట్ల ఎవరూ అపోహలు పడాల్సిన అవసరం లేదన్నారు.రాష్ట్రంలో తొలి కరోనా పాజిటివ్​ కేసు బయటపడి నేటికి ఏడాది గడిచిందని.. అప్పటి నుంచి గాంధీ ఆస్పత్రి సిబ్బంది నిరంతరంగా సేవలందించారన్నారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ, సికింద్రాబాద్​ ప్రజల తరఫున.. వైద్యులు, సిబ్బందికి సెల్యూట్​ చేస్తున్నట్లు చెప్పారు.

ఫస్ట్ మూవీతోనే షాక్ తిన్న ప్రియా ప్రకాష్ వారియర్…!

బాలీవుడ్ క్వీన్ కంగనకు కోర్టు షాక్. అరెస్ట్ వారెంట్ జారీ!

వచ్చే నెల 9న పార్టీని ప్రకటించనున్న షర్మిల!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -