Friday, April 26, 2024
- Advertisement -

వచ్చే నెల 9న పార్టీని ప్రకటించనున్న షర్మిల!

- Advertisement -

ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్.రాజ‌శేఖ‌ర్ రెడ్డి రాజ‌కీయ వార‌సురాలిగి తెలంగాణ రాజ‌కీయాల్లోకి అడుగు పెట్ట‌డానికి వైఎస్ ష‌ర్మిల రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇటీవ‌లే మీడియా ముందుకు వ‌చ్చి… పేద‌ల పేన్నిటిగా నిలిచి, రైత‌ల పాలిట దేవుడిగా నిలిచిన వైఎస్.రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఆద‌ర్శాల‌తో త‌మ రాజ‌కీయ పార్టీ ముందుకు సాగుతుంద‌ని ష‌ర్మిల ప్ర‌క‌టించారు.

తెలంగాణ‌లో రాజ‌కీయ పార్టీని ఏర్పాటు చేయ‌బోతున్న‌ట్టు వెల్ల‌డించారు. ఈ క్ర‌మంలోనే తెలంగాణ‌లోని ఉమ్మ‌డి జిల్లాల్లో వైఎస్ అభిమానుల‌తో ఆత్మీయ స‌మావేశాలు నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా రాష్ట్ర రాజ‌కీయ ప‌రిస్థితులు, స‌మ‌స్య‌లు స‌హా ప‌లు అంశాల‌ను గురించి తెలుసుకుంటున్న‌ట్లు స‌మాచారం. అతి త్వ‌ర‌లో ఈ అత్మీయ స‌మావేశాలు ముగియనున్నాయ‌ని ఆమె స‌న్నిహిత వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

ఇప్ప‌టికే ప‌లు ఉమ్మ‌డి జిల్లాల్లో ఆత్మీయ స‌మావేశాలు నిర్వ‌హించార‌ని ష‌ర్మిల స‌న్నిహిత వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఇవి పూర్త‌యిన వెంట‌నే వ‌చ్చే నెల 9న ఆమె స్థాపించ‌బోయే రాజ‌కీయ ప‌ర్టీ వివ‌రాల‌ను మీడియాతో పంచుకోనున్నార‌ని ఆమె అనుచ‌రుడు తూడి దేవేంద‌ర్ రెడ్డి తెలిపారు. తాజాగా ఆయ‌న మీడ‌యాతో మాట్లాడుతూ ఈ వివ‌రాల‌ను స్ప‌ష్టం చేశారు. ఇప్ప‌టికే ప్రారంభ‌మైన ఆత్మీయ స‌మావేశాలు వ‌చ్చే నెల 9న ఖ‌మ్మంలో చివ‌రి అత్మీయ స‌మావేశం జ‌ర‌గ‌నుంద‌ని తెలిపారు. అదే రోజున పార్టీ వివ‌రాలు ష‌ర్మిల వివ‌రాలు వెల్ల‌డించ‌నున్నారు.

బాక్సింగ్ రింగులోకి రాశిఖన్నా! అందుకేనా..

‘పైన పటారం.. లోన లోటారం’ అంటున్న అన‌సూయ

పవన్ కల్యాణ్ ఒక స్టేట్ రౌడీ: వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్

కాలి న‌డ‌క‌న తిరుమ‌ల కొండెక్కిన ఉప్పెన‌ హీరో, హీరోయిన్లు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -