హైదరాబాద్ బోయిన్పల్లిలో కిడ్నాప్ కలకలం చెలరేగింది. హాకీ మాజీ ప్లేయర్ ప్రవీణ్రావు కుటుంబ సభ్యులు కిడ్నాప్నకు గురయ్యారు. ఐటీ అధికారులమంటూ ఇంట్లోకి చొరబడ్డారు. నకిలీ సర్చ్ వారెంట్, ఐడీ కార్డులు చూపించి ప్రవీణ్ రావుతో పాటు అతడి సోదరులను బెదిరించిరు. ప్రవీణ్ రావు, సునీల్ రావు, నవీన్ రావును హాల్ లో కూర్చో బెట్టి విచారణ చేస్తున్నట్లు నటించారు దుండగులు.
ఆ తర్వాత ప్రవీణ్ రావు కుటుంబ సభ్యులను బెడ్ రూమ్ లో బంధించి.. ముగ్గురు అన్నదమ్ముల తో పాటు, ల్యాప్ టాప్, సెల్ ఫోన్లను తీసుకొని వెళ్లిపోయారు. అయితే, హఫీజ్పేటలోని ఓ స్థలవివాదంలో ఈ కిడ్నాప్ జరిగినట్లు తెలుస్తోంది. ముగ్గురిని కిడ్నాప్ చేసిన దుండగులు భూమా అఖిలప్రియ భర్త భార్గవ రెడ్డి పేరుతో బెదిరించారని సమాచారం. హై ప్రొఫైల్ కేసు కావడంతో పోలీసులు ఈ కిడ్నాప్ను ఛాలెంజ్గా తీసుకున్నారు.
రంగంలోకి దిగిన టాస్క్ఫోర్స్ పోలీసులు… సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేపట్టారు. గంటల వ్యవధిలోనే కిడ్నాప్ మిస్టరీని ఛేదించారు. బాధితులను క్షేమంగా ఇంటికి తీసుకొచ్చిన పోలీసులు.. తెల్లవారుజూమున కుటుంబ సభ్యులకు అప్పగించారు. వికారాబాద్ సమీపంలో అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు.
ఎన్టీఆర్ షూ ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..