ఎప్పుడూ జగన్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసే టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఇప్పుడు పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేశారు. తాజాగా జనసేన అధినేతపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీలో కలకలం రేపుతున్నాయి. ఎందుకంటె పవన్ ఇప్పటికీ టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారు.
పవన్ హాయిగా సినిమాలు తీసుకోకుండా రాజకీయాలు ఎందుకని వ్యాఖ్యానించారు. పవన్ రాజకీయ జీవితానికి ఆయన అన్న చిరంజీవి శాపంగా మారారని పేర్కొన్నారు. నాడు ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవి, ఆ పార్టీని ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారని గుర్తు చేశారు. చిరంజీవి పెద్ద పొరపాటు చేశారని వ్యాఖ్యానించారు. చిరు చేసిన పొరపాటు పవన్కు మైనస్ అని అభిప్రాయపడ్డారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బాగా కష్టపడి సినిమాల్లో మంచి పేరు సంపాదించుకున్నారని జేసీ తెలిపారు. జనసేన పార్టీ స్థాపించడంపై మాట్లాడుతూ.. విత్తనాలు వేస్తే సరిపోదని, పంట కూడా బాగా పండాలని వ్యాఖ్యానించారు. తనకు ఇక ఎంపీగా పోటీ చేయాలనే ఉద్దేశం లేదని, చంద్రబాబు అనుగ్రహిస్తే తన కుమారుడిని వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయిస్తానని చెప్పారు. పవన్ కల్యాణ్ పోటీ చేసిన తమ పార్టీకి వచ్చే నష్టం ఏమీ లేదన్నారు. చిరంజీవి తన పార్టీని విలీనం చేసి తప్పు చేశారని అభిప్రాయపడ్డారు. మరి పవన్ అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.