రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జగన్ గెలుపును అడ్డుకునే శక్తి ఎవరికి లేదన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. 2024లోనూ ఏపీకి కాబోయే సీఎం జగనేనని జోస్యం చెప్పారు. గుడివాడలో వైసీపీ 14వ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించగా ఈ సందర్భంగా మాట్లాడిన కొడాలి నాని..వచ్చే ఎన్నికల్లో జగన్ గెలుపును అడ్డుకునే శక్తి ఆంధ్రప్రదేశ్ లో ఎవరికీ లేదన్నారు.
ప్రతిపక్షాలన్నీ ఏకమైనా, దేవుడి దీవెనలు, ప్రజల ఆశీస్సులు సీఎం జగన్ కు ఉన్నాయని అన్నారు. 14ఏళ్ల పాటు ఒడుదుడుకులు ఎదురకున్న సీఎం జగన్..ఇవాళ తిరుగులేని శక్తిగా నిలిచారన్నారు. వైసిపి ఎదుర్కొనే మూడో ఎన్నికలో జగన్ గెలుపును ఎవ్వరూ అడ్డుకోలేరని చెప్పారు.వైసీపీ ఆవిర్భావం తర్వాత జరిగిన ప్రతీ ఎన్నికలో రికార్డు స్థాయి మెజార్టీ వచ్చిందని..ప్రతి ఎన్నికల్లో జగన్ తన సత్తా నిరూపించుకున్నారన్నారు. ఈసారి కూడా వైసీపీ హవాలో ప్రతిపక్షాలు కొట్టుకుపోవడం ఖాయమన్నారు నాని.