Sunday, May 19, 2024
- Advertisement -

పొమ్మ‌న‌లేక పొగ‌బెడుతున్నారా….?

- Advertisement -

క‌ర్నూలు వైసీపీ ఎంపీ బుట్టారేణుక టీడీపీ మార‌డంపై సాక్షి ఛాన‌ల్లో కథనాన్ని ప్ర‌సారం చేయ‌డంతో పార్టీలో ప్ర‌కంప‌న‌లు మొద‌ల‌య్యాయి. అయితె దీని వెనుక పార్టీ వారె ఉన్నార‌నె వార్త‌లు వినిపిస్తున్నాయి. నేను పార్టీ మారడంలేదు మొర్రో..’ అని వైఎస్సార్సీపీ ఎంపీ బుట్టా రేణుక తెగేసి చెబుతున్నా ‘సాక్షి’ ఆమె పార్టీ మారిపోవడం ఖాయమని విశ్లేషిస్తోంది.

గత కొద్ది రోజులుగా బుట్టా రేణుక విషయంలో ‘పార్టీ ఫిరాయింపు’ ఊహాగానాలు గట్టిగా విన్పిస్తున్న విషయం విదితమే. నిజానికి నంద్యాల ఉప ఎన్నిక సమయంలోనే టీడీపీ, బుట్టా రేణుకకు ‘వల’ విసిరింది. కానీ, ఆమె అప్పట్లో టీడీపీ ఆఫర్‌ని తిరస్కరించారు. దాదాపు 100 కోట్ల ప్యాకేజీని ఇందుకోసం టీడీపీ సిద్ధం చేసిందట. దాంతో ఆ ప్యాకేజీని బుట్టా రేణుక కాదనలేకపోతున్నారట. చంద్రబాబు విదేశీ పర్యటన తర్వాత ఏ క్షణంలో అయినా బుట్టా రేణుక పార్టీ ఖండువా క‌ప్పుకో నున్న‌ట్లు వార్త‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి.

వైఎస్సార్సీపీలో బుట్టా రేణుకకి పొగపెడ్తున్నదెవరు.? ఇదే ఇప్పుడు మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది. అయితె జ‌గన్ సొంత చానెల్‌లో వచ్చిన కథనంపై కర్నూలు ఎంపీ బుట్టా రేణుక తీవ్ర మనస్థాపం చెందినట్లు తెలుస్తోంది. పార్టీ మారడంపై అధినేత జగన్‌కు మొన్నే క్లారిటీ ఇచ్చినప్పటికీ.. ఇప్పుడు కావాలనే వ్యతిరేక కథనాలు రాయిస్తున్నట్లు రేణుక వర్గీయులు వాపోతున్నారు.

బేరం కుదిరింది’ అంటూ లేనిపోని విషయాలతో జగన్ సొంత పత్రికలో కల్పిత వార్తలు రావడంపై బుట్టా రేణుక ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. పొమ్మనలేక పొగబెడుతున్నారేమో అనే అనుమానాలను ఆమె వర్గీయులు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రేణుక మీడియా ముందుకు వచ్చేందుకు నిరాకరిస్తున్నారని, అయితే మౌనంగా ఉంటూనే పరిస్థితులన్నింటినీ ఆమె గమనిస్తున్నారని బుట్టా రేణుక వర్గీయులు చెబుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -