ఎపిలో సర్వేలు ఎవరైనా చేయిస్తున్నారంటే అది లగడపాటి రాజగోపాల్ అని ఠక్కున చెప్పేస్తుంటారు. ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా అందరికంటె ముందుగానే సొంతంగా సర్వేలు చేయించి పలితాలను ప్రకటిస్తూ ఆశ్చర్యపరుస్తుంటారు. లగడపాటి చేసిన సర్వేలు దాదాపు ఇంచుమించు కరెక్టుగానే ఉంటాయి.
తాజాగా ఏపీలో ఎన్నికలు లేకున్నా తాజాగా లగడపాటి రాజగోపాల్ తాజాగా 2019 ఎన్నికలపై సర్వే చేయించారు. ఫలితాలు మాత్రం అసక్తికరంగా వచ్చాయింట. లగడపాటి ఆశ్చర్యపోవడమే కాకుండా ఆ విషయాన్ని మీడియాకు కూడా తెలిపారు.
తాజా సర్వేలో ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి పవన్ కళ్యాణ్తో కలిసి ఎన్నికలకు వెల్తే గెలవడం చాలా ఈజీ అనీ… ఒంటరిగా పోటీ చేస్తే అన్ని సీట్లు రావని తేల్చి చెప్పాడు. ఇక జగన్ మోహన్ రెడ్డి పార్టీకి 137 సీట్లు వచ్చే అవకాశం ఉందట.
కోస్తాలో 37 సీట్లు టిడిపికి రానుండగా ఫిరాంపులు ఎమ్మెల్యేలెవరూ తెలుగుదేశం పార్టీలో గెలవరని లగడపాటి సర్వేలో తేలింది. దీన్నిబట్టి వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి కింగ్ మేకర్గా మారుతారని లగడపాటి రాజగోపాల్ చెబుతున్నారు.