Sunday, May 19, 2024
- Advertisement -

పవన్ నంద్యాల ప్రచారంకు రాకపోవడానికి కారణం బాలయ్య..?

- Advertisement -

ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నిక చాలా ప్రతిష్టాత్మకంగా మారింది. భూమా నాగిరెడ్డి స్థానం అది… పైగా మంత్రి అఖిలప్రియకు పెద్ద సవాలుగా మారింది. తన తండ్రి స్థానాన్ని ఎలాగైన దక్కించుకోవాలని టార్గెట్ తో ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తున్నారు. ఇక వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి రంగంలోకి దిగడంతో పరిస్థితి మారిపోయింది. అందులోను సీఎం చంద్రబాబు నాయుడుని లక్ష్యంగా చేసుకుని జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

వాటికి ధీటుగా సమాధానమిచ్చే నాయకుడు కనబడటంలేదు. అయితే జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ వస్తే బాగా హెల్ప్ అవుతుందని అనుకున్నారు. కానీ పవన్ ఇప్పటివరకు స్పందించలేదు. దీనితో ఇక బాలయ్యతో ప్రచారం చేయించాలని కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సంగతిపై ఈనెల 13వ తేదీన నంద్యాలలోని బాలయ్య అభిమాను సంఘాల్లోని కీలక వ్యక్తులు ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈనెల 18 నుంచి నంద్యాలలో క్యాంపు వేస్తారని అంటున్నారు. అందుకు ముందుగానే నంద్యాలలో రెండు, మూడు రోజుల పాటు బాలయ్యను పర్యటనకు వచ్చేట్లు చేసేందుకు టీడీపీ ప్లాన్ చేస్తోంది. ప్రచారంకు వచ్చేందుకు బాలకృష్ణ కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే ప్రచారంలో బాలయ్య దిగితున్నాడు కాబట్టి.. పవన్ ప్రచారంకు రావడం లేదని తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -