మంత్రి నారా లోకేష్ బాబు మళ్లీ నోరు తడబడి అడ్డంగా దొరికిపోయాడు. ఆయన ప్రసంగాల్లో ఎక్కువ తప్పులే దొరుకుతుండటంతో.. ఆయన ఈ మధ్య మాట్లాడటం మానేశారు. అధికారిక స్పీచులు ఇవ్వక చాలా రోజులు కావాస్తోంది. ఇచ్చినా నాలుగు చిన్న చిన్న మాటలు మాట్లాడి ముగించేస్తున్నాడు.
గతంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా మాట్లాడుతూ.. వర్థంతి శుభాకాంక్షలు అని చెప్పడం.. మంచి నీటి సమస్యను సృష్టిస్తాననడం.. 200 సీట్లు గెలుస్తానని చెప్పడం ఇలా ఎన్నోరకాలుగా మిస్టేక్ గా మాట్లాడి విమర్శలకు గురైయాడు లోకేష్ బాబు. ఇక అప్పటి నుండి.. ఆయన ఏం మాట్లాడిన.. అందులో ఏ ఒక్క పదమైనా తప్పు దొర్లకపోతదా..అని రాష్ట్ర ప్రజలంతా ఎదురు చూస్తున్న వేళ మరోసారి దొరికిపోయాడు. ఏకంగా ఈసారి ఆంధ్రప్రదేశ్ ఓ రాష్ట్రమని మరిచిపోయిన లోకేశ్, ఏపీని దేశంగా చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఏపీని కంపెనీగా పోల్చాడు. విశాఖలో అత్యంత ప్రతిష్టాత్మకంగా అంతర్జాతీయ ఆవిష్కరణల ప్రదర్శన -2017 జరుగుతోంది కదా.మరి అంత పెద్ద సదస్సు జరుగుతున్నప్పుడు రాష్ట్ర యువమంత్రి మాట్లాడకపోతే కుదరదు కదా.అందుకే రెండో రోజు లోకేశ్ మైక్ అందుకుని ప్రసంగించాడు. ఇక తొందరపాటులోనో లేక అలవాటులోనో తెలియదు కానీ, తనదైన తప్పుల్లో మళ్లీ కాలేశాడు. ఏపీ దేశంగా ఓసారి.. ఏపీ కంపెనీ అంటూ మరోసారి తప్పుగా మాట్లాడారు.
దీన్ని కరెక్ట్ చేసుకోకుండానే.. ప్రసంగాన్ని ముగించేశాడు మంత్రి. కానీ అక్కడున్న వారంతా లోకేష్ మాటలు విని షాక్ అయ్యారు. అంతే కాకుండా అక్కడ ఉన్నవారు నవ్వుకున్నారు. కానీ అంతలోనే చినబాబు ప్రసంగం ముగియడంతో ఇక ఆ మిస్టేక్ అలానే ఉండిపోయింది. ప్రస్తుతం ఆ ప్రసంగంకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.