కేసీఆర్పై కాంగ్రెస్ నేతలు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఢీల్లీకి వెళ్లే ముందు దొంగ దీక్షలు చేసిన కేసీఆర్ కేంద్ర తీరును ఎండగడుతానని, ఒడ్ల కొంటరా ? లేదా ? అనె అంశంపై స్పష్టత ఇవ్వాలని కేసీఆర్ కేంద్రాని నిలదీశారన్నారు. మరి ఢిల్లీకి వెళ్లి అక్కడ ప్రధానిలో పాటు, కేంద్ర మంత్రులను కలిసిన సీఎం.. వారితో ఏం చర్చలు జరిపారో చెప్పాన్నారు.
ఢిల్లీకి వెళ్లే ముందు బీజేపీని ఎండగడుతా అని ఘాటుగా మాట్లాడిన సీఎం ఢిల్లీకి వెళ్లి ఏం పీకారో చెప్పాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కేసీఆర్ సైలెంట్గా ఉంటే ఏమని అర్ధం చేసుకోవాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు.
కోవిడ్ కుటుంబాలను ఆదుకుంటామని చెప్పిన కేసీఆర్.. కోవిడ్తో మరణించిన వారి కుటుంబాలకు ఇంతవరకు నష్టపహారం ఇవ్వలేదన్నారు. కేసీఆర్ ముచ్చట రూపాయంత ఉంటే… చేతులు మాత్రం చారాన అంత ఉన్నాయని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఢిల్లీలో ఏం చేశారో ? రైతుల ధాన్యం ఏప్పుడు తీసుకుంటారో చెప్పాలని ఢిమాండ్ చేశారు.
తిరుపతిలో వింత ఘటన.. క్యూ కడుతున్న జనం