Sunday, April 28, 2024
- Advertisement -

తిరుపతిలో వింత ఘటన.. క్యూ కడుతున్న జనం

- Advertisement -

చిత్తూరు జిల్లా తిరపతి నగరంలోని శ్రీ కృష్ణా నగర్‌లో వింత ఘటన చోటు చేసుకుంది. వారం రోజుల క్రితం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. దీంతో జిల్లా వ్యాప్తింగా వాగులు, వంకలు ఏరులైపాయాయి. ప్రలయం వస్తుందా అన్న విధంగా పడ్డ వర్షానికి ఇళ్లు కొట్టుకుపోయాయి. వేల మంది నిరాశ్రయులైయ్యారు. తిరపతి నగరంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. జనజీవనం స్తంభించింది.

భారీ వర్షాలతో పలు ఇళ్లు నీటమునిగాయి. వర్షాలు, వరదల అనంతరం వరదలు వల్ల ఇళ్లలోకి బురద చేరింది. దీంతో వాళ్లు తమ ఇళ్లను శుభ్రం చేసుకునే పనిలో పడ్డారు. ఇందులో భాగంగానే నగరంలోని శ్రీ కృష్ణా నగర్‌లో ఓ మహిళ తన ఇంట్లో ఉన్న వాటర్ ట్యాంక్‌ను శుభ్రం చేసేందుకు అందులోకి దిగింది. ట్యాంక్‌ను శుభ్రం చేస్తుండగా.. ఆ సంప్పు ఒక్కసారిగా పైకి వచ్చింది. దాదాపు అది 25 అడుగుల ఎత్తుకు వచ్చింది. దీంతో భయాందోళనకు గురైన మహిళ భిగ్గరగా అరుస్తూ సంపునుంచి బయటకు వచ్చింది.

ఆ సంపుకు మొత్తం 28 సిమెంట్‌ రింటగులు ఉండగా దాదాపు 18 రింగులు బయటకు వచ్చాయి. దీంతో ఈ వింతను చూసేందుకు పరిసర ప్రాంత జనం అక్కడికి క్యూ కతున్నారు. దీంతో పాటు అనంతపురం జిల్లాలో ఎండిపోయిన బోరు బావి నుంచి నీరు భారీగా బటయకు వస్తుది. భూ గర్భ జలాలు ఎక్కవ అవ్వడం వల్ల వాటి ఒత్తిడికి ఓరలు పైకి లేచాయని, భూ గర్భ జలాలు తగ్గిన తర్వాత అవి యధావిదిగా క్రిందికి పోతాయాని అధికారులు చెబుతున్నారు.

3 కోట్ల గంజాయి పట్టివేత

గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో దారుణం..

బాబు సంస్కారానికి జగన్ నమస్కారం🙏

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -