Sunday, May 19, 2024
- Advertisement -

మంత్రి అఖిల‌ప్రియ‌కు బిగ్‌షాక్‌…

- Advertisement -

ఎన్నిక‌ల వేల వైసీపీలోకి జంపింగ్‌లు భారీగా కొన‌సాగుతున్నాయి. వైసీపీ ఫిరాయింపు నేత బుట్టా, టీడీపీనేత మాగుంట‌, ఆదాల ప్ర‌భాక‌ర్ త‌దిత‌రులు వైసీపీ కండువా క‌ప్పుకున్నారు. తాజాగా మంత్రి అఖిల ప్రియ‌కు భారీ షాక్ త‌గిలింది. సొంత మేన‌మామ ఎస్వీ జ‌గ‌న్ రెడ్డి జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలో చేరారు. ఆళ్లగడ్డకు చెందిన ఎస్వీ జగన్‌ గత కొంతకాలంగా టీడీపీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన టీడీపీకి రాజీనామా చేసి వైసీపీ కండువ కప్పుకున్నారు. దీంతో ఎస్ వి సుబ్బారెడ్డి, గంగుల ప్రభాకర్ రెడ్డి కుటుంబాలు ఒక్కటయ్యాయి. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో భూమా కుటుంబానికి దశబ్దాల కాలంగా అండగా ఉన్న కుటుంబాలతో పాటు వారి దగ్గరి బంధువులు సైతం టీడీపీ వీడుతున్నారు. గత వారం రోజుల నుంచి వరుసగా ఆపార్టీ నాయకులు వైఎస్‌ఆర్‌సీపీ తీర్థం పుచ్చుకుంటుండటంతో మంత్రి అఖిలప్రియ ఉక్కిరిబిక్కిరవుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -