దేశంలో కరోనా వచ్చినప్పటి నుంచి సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు నానా అవస్థలు పడుతున్నారు. ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నా ఈ కరోనా నుంచి మాత్రం తప్పించుకోలేకపోతున్నారు. కోటీశ్వరుడైనా.. కడు పేద అయినా కరోనా వచ్చిందంటే ప్రాణాలు తీసేస్తుంది. అయితే కరోనా వస్తే జాగ్రత్త చర్యలు పాటిస్తూ.. ఇమ్యూనిటీ పెంచుకున్న వారు బాగానే కోలుకుంటున్నారు. కరోనాతో ఇప్పటి వరకు పలువురు రాజకీయ నేతలు కన్నుమూసిన విషయం తెలిసిందే.
తాజాగా తణుకు మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం సీనియర్ నాయకుడు వైటీ రాజా కరోనాతో కన్నుమూశారు. అయితే ఆయనకు పది రోజుల క్రితం కరోనా వచ్చి తగ్గినప్పటికీ మృత్యువు మాత్రం వదలలేదు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మాజీ ఎమ్మెల్యే యలమర్తి తిమ్మ రాజా కొన్ని రోజుల క్రితం కరోనా బారినపడ్డారు.
దాంతో ఆయన ఓ ఆస్పత్రిలో చికిత్స చేయించుకొని 10 రోజుల కింద కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. అయితే ఆయన ఒక్కసారే అస్వస్థకు గురి కావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ప్రవైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆదివారం ఆయన చికిత్స పొందుతూ ఉదయం కన్నుమూశారు. ఆయన మృతితో నియోజకవర్గంలో విషాధషాయలు అలుముకున్నాయి.
విస్తరణవాద శక్తులకు గట్టిగా బదులిస్తాం : మోదీ