తెలంగాణ మహాకూటమిలో భాగంగా కాంగ్రస్ తరఫున పోటీ చేయబోతున్న అభ్యర్ధుల్లో మొదటి విడతగా 34 మంది అభ్యర్ధుల జాబితాను కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ప్రకటించింది. తొలి జాబితాలో చోటు దక్కించుకున్నారిలో అధికశాతం మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, సీనియర్ నేతలు ఉన్నారు. మొత్తం 119 నియోజకవర్గాలకు గాను ఫస్ట్ లిస్టులో 34 మంది పేర్లు ఖరారు చేశారు. ఈ నెల 12న పూర్తి స్థాయి అభ్యర్ధుల జాబితా రిలీజ్ చేసే అవకాశాలున్నాయి. అభ్యర్ధుల ఎంపిక పొత్తులు సీట్ల పంపకాల వ్యవహారాలపై యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీతో 12న కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ కానుంది. ఆ భేటీ తర్వాత పూర్తి స్థాయిలో అభ్యర్ధుల జాబితా విడుదల చేయనున్నట్టు సమాచారం.
34 మంది అభ్యర్ధులతో కాంగ్రెస్ మొదటి జాబితా ఇదే
చిన్నారెడ్డి – వనపర్తి
జగ్గారెడ్డి – సంగారెడ్డి
భట్టి విక్రమార్క – మధిర
రేవంత్రెడ్డి – కొడంగల్
గండ్ర వెంకటరమణరెడ్డి – భూపాలపల్లి
కొండా సురేఖ – పరకాల
కూన శ్రీశైలంగౌడ్ - కుత్బుల్లాపూర్
సుధీర్రెడ్డి – ఎల్బీనగర్
ప్రతాప్రెడ్డి – షాద్నగర్
సబితా ఇంద్రారెడ్డి – మహేశ్వరం
కార్తీక్రెడ్డి – రాజేంద్రనగర్
షబ్బీర్ అలీ – కామారెడ్డి
సుదర్శన్రెడ్డి – బోదన్
శ్రీధర్బాబు – మంథని
మహేశ్వర్రెడ్డి – నిర్మల్
పొన్నాల లక్ష్మయ్య – జనగామ
జీవన్రెడ్డి – జగిత్యాల
బలరాంనాయక్ – మహబూబాబాద్
దొంతుమాధవరెడ్డి – నర్సంపేట
సంపత్ – ఆలంపూర్
ఆరేపల్లి మోహన్ – మానకొండూరు
జానారెడ్డి – నాగార్జునసాగర్
ఉత్తమ్కుమార్రెడ్డి – హుజూర్నగర్
ఉత్తమ్ పద్మావతి – కోదాడ
గీతారెడ్డి – జహీరాబాద్
దామోదర రాజనర్సింహ – ఆందోల్
కోమటిరెడ్డి వెంకట్రెడ్డి – నల్గొండ
కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి – మునుగోడు
సురేష్ షెట్కర్ – నారాయణ్ఖేడ్
రమేష్ రాథోడ్ – ఖానాపూర్
పొన్నం ప్రభాకర్ – కరీంనగర్
సునీతాలక్ష్మారెడ్డి – నర్సాపూర్
వంశీచందర్రెడ్డి – కల్వకుర్తి
డీకే అరుణ – గద్వాల