గత కొంత కాలంగా టీఆర్ఎస్ లో ముసలం చోటు చేసుకుంది. మాజీ మంత్రి ఈటెల రాజేంద్ర తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామ చేసిన విషయం తెలిసిందే. ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మరో వికెట్ పడిపోయింది. పార్టీ క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ఆ పార్టీ ఉప్పల్ నియోజకవర్గ నాయకుడు, బాలల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు తెలంగాణ సంపత్ తెలిపారు. తెలంగాణ భవన్కు ఫ్యాక్స్ ద్వారా తన రాజీనామా పత్రాన్ని పంపించినట్టు ఆయన వెల్లడించారు.
ఈ సందర్భంగా సంపత్ మాట్లాడుతూ.. గత జిహెచ్ఎంసి ఎన్నికలలో కొత్తగా వచ్చిన వారికి కార్పొరేటర్ టికెట్లు ఇచ్చారన్నారు. టిఆర్ఎస్ పార్టీలో తెలంగాణ ఉద్యమకారులకు ఆన్యాయం జరుగుతుందని ..ఉద్యమకారుల మీద దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో కేవలం కుటుంబ వ్యవస్థ నడుస్తుందన్నారు.
టిఆర్ఎస్ పార్టీ జెండా మోసిన వారికి ఏలాంటి పదవులు, అవకాశాలు ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. టిఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలకు సుప్రీమ్ అప్పజెప్పడం వల్ల నాలాంటి ఉద్యమకారులకు అన్యాయం జరుగుతుందని సంపత్ విమర్శించారు. ఈటల రాజేందర్ అడుగుజాడల్లో నడుస్తూ వారు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని తెలిపారు.
కాంట్రాక్టర్పై చెత్త పోయించిన ఎమ్మెల్యే.. ఎక్కడో తెలుసా?‘
చైనాలో పేలిన గ్యాస్ పైప్ లైన్.. 12 మంది మృతి
గాయపడ్డ డుప్లెసిస్.. ఆస్పత్రిలో చేరిక.. ఫ్యాన్స్లో టెన్షన్