ఉద్యమ నాయకుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ను విమర్శించే స్థాయి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్కు ఉందా అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రశ్నించారు. శుక్రవారం ఆయన హన్మకొండ ఆర్అండ్బీ అతిథి గృహంలో మీడియాతో మాట్లాడుతూ.. బండి సంజయ్ వ్యవహారం కొత్త బిచ్చగాడిలా ఉందని విమర్శించారు. కార్పోరేటర్గా కూడా గెలవలేని వ్యక్తిని నాలుగుసార్లు ఓడిపోయాడన్న సానుభూతితో కరీంనగర్ ప్రజలు ఎంపీగా గెలిపించారన్నారు తెలంగాణలో మత విద్వేషాలతో చిచ్చు పెట్టి లబ్ది పొందే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సంజయ్ ఎంపీగా గెలవడం ఇదే మొదటిసారి,ఇదే ఆఖరిసారి అని వ్యాఖ్యానించారు.’కేసీఆర్ను జైలుకు పంపిస్తారా… ఎవరనుకుంటున్నావ్ జైల్లో పెట్టేందుకు… ఆయన తెలంగాణ ఉద్యమకారుడు,తెలంగాణ రాష్ట్రం తెచ్చిన బిడ్డ. ఆయన మీద పిచ్చి పిచ్చి విమర్శలు చేస్తారా… జనం తీసి కొడితే మానేరు డ్యామ్లో పడుతావ్…’ అని సంజయ్ని ఎర్రబెల్లి హెచ్చరించారు.
తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి ఏం తెచ్చారో చెప్పగలరా అని బండి సంజయ్ని ఎర్రబెల్లి ప్రశ్నించారు.బీజేపీ నేతలు మిషన్ భగీరథకు, మిషన్ కాకతీయకు, కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధులు తెచ్చారా అని నిలదీశారు. బండి సంజయ్ ఇలాగే వ్యవహరిస్తే కరీంనగర్ ప్రజలే ఉరికిచ్చి కొడతారని హెచ్చరించారు. బండి సంజయ్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదని.. ఆయన కేసీఆర్ గురించి మాట్లాడేంత పెద్దవాడు కాలేదని అన్నారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే తెలంగాణ ప్రజలు క్షమించరన్న విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు.కాగా, కొత్తగా గెలిచిన బీజేపీ కార్పోరేటర్లతో శుక్రవారం పాతబస్తీలోని భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్న సందర్భంగా బండి సంజయ్ కేసీఆర్పై విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని… రాసి పెట్టుకోవాలని వ్యాఖ్యానించారు.సంజయ్ వ్యాఖ్యలకు కౌంటర్గా ఎర్రబెల్లి తాజాగా ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.
టీపీసీసీ చీఫ్ ఫిక్స్.. రాష్ట్ర పగ్గాలు ఆ నేతకే
ఏడాది పాటు అవన్ని రద్దు చేయాలి.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు