జగన్ చేస్తున్న పాదయాత్ర కర్నూలు జిల్లాలో కొనసాగుతోంది. బహిరంగ సభల్లో ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరే విధానాలను ఎండ గడుతున్నారు. పాదయాత్ర చేస్తోన్న జగన్.. కర్నూలు జిల్లా పత్తికొండ ఊరువాకిలి సెంటర్లో సభలో చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.
మనకు ఎలాంటి నాయకుడు కావాలని మన మనసాక్షిని అడగాలని హితవు పలికారు. ‘మోసం చేసేవాడు నాయకుడిగా కావాలా? అందరూ చేతులు ఊపుతూ చెప్పండి.. అసత్యాలు చెప్పే నాయకుడు కావాలా? నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో సంతోషంగా ఉన్నారా?’ అని జగన్ అడిగారు. చట్ట సభల్లో చంద్రబాబు నాయుడు 20 నుంచి 30 కోట్ల రూపాయల వరకు ఇచ్చి ఎమ్మెల్యేలను కొంటున్నారు’ అని జగన్ వ్యాఖ్యానించారు.
ఉన్నది లేనట్లుగా చూప్తిస్తారు, లేనిది ఉన్నట్లుగా చూపిస్తున్నారు. కొన్ని పేపర్లు, టీవీలు చంద్రబాబుకు మద్దతుగా ఉన్నాయన్నారు. అయినా ఇదే దో ఎవరికి తెలియనట్లు కొత్తగా చెప్పుకోచ్చారు జగన్. ఈ రాష్ట్రంలో చట్టం లేదు. చట్టాలు చేయాల్సిన చట్టసభల్లోనే పశువులను కొన్నట్లు ఎమ్మెల్యేలను కొంటున్నారని జగన్ ఆరోపించారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవ్యక్తి వీడియో టేప్లతో పాటు దొరికి పోయినా ఆ ముఖ్యమంత్రి కూడా రాజీనామా చేయడం లేదు. ఇటువంటి దారుణ పరిస్థితుల్లో రాష్ట్రాన్ని నడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.