Friday, May 17, 2024
- Advertisement -

బొబ్బ‌లెక్కిన‌ కాళ్ళు…. లెక్క‌చేయ‌కుండా పాద‌యాత్ర‌లో దూసుకెల్తున్న జ‌గ‌న్‌.

- Advertisement -

ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర‌ను కొన‌సాగిస్తున్నారు. ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయ‌కుండా ప్ర‌జ‌ల‌కు నేనున్నానంటూ ముందుకు సాగిపోతున్నారు. కాళ్ళు బొబ్బ‌లు క‌డుతున్నాయి… అరి కాళ్ళు, బొట‌న వేళ్లు పుండ్లు అవుతున్నా ఆ బాధ‌నంతా త‌న‌లోనె దిగ‌మింగుతూ ప్ర‌జ‌ల‌కు ఒక భ‌రోసా క‌ల్పిస్తూ జ‌నంతో మ‌మేక‌మ‌వుతూ పాద‌యాత్ర‌ను దిగ్విజ‌యంగా కొన‌సాగిస్తున్నారు.

పాద‌యాత్ర‌లో జ‌నం తాకిడితో కాళ్ళు చితికిపోతున్నా లెక్క చేయ‌కుండా అడుగులు ముందుకు వేస్తూ సాగిపోతున్నారు.. సెక్యూరిటీ ఎంత ఆపుతున్నా జనాలు ఒక్కోసారి తోసుకుని త‌మ అభిమాన నేత‌ జగన్ చూసేందుకు తండోప‌తండాలుగా వ‌స్తున్నారు. అటువంటి సమయంలో పలువురు జగన్ కాళ్ళను కూడా తొక్కేస్తున్నారు. అభిమానంతో వస్తున్న జనాలను చూసి జగన్ కూడా ఏమనలేక పోతున్నారు. ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మ‌వుతూ… వారి బాధ‌ల‌ను సావ‌ధానంగా వింటూ ముందుకు సాగుతున్నారు.

పాద‌యాత్ర‌లో తన వద్దకు వస్తున్న అభిమానులను, జనాలనను ఆప వద్దని సెక్యురిటీకి జగన్ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వటంతో సెక్యూరిటీ కూడా ఇబ్బందులు పడుతున్నారు. పలకరింపుతోనో.. కరచాలనంతోనో, చిరునవ్వుతోనో స్పందిస్తూ జ‌గ‌న్‌ ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే కొన్ని వేలమంది మహిళలు, ప్రధానంగా యువత జగన్ తో సెల్ఫీలు దిగారు. పాదయాత్రలో కాళ్ళు సహకరించకున్నా మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో మందులు రాసుకుంటూ మళ్ళీ నడకకు సిద్దమవుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -