వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పాదయాత్రకు వస్తున్న స్పందనను చూసి అధికార టీడీపీకి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. అయితే తాజాగా ఏపీకీ సంబంధించి జగన్ తీసుకున్న నిర్ణయం టీడీపీ నాయకులకు ప్యాంట్లు తడిసిపోతున్నాయి. విభజన సమయంలో ఏపీకీ ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పిన టీడీపీ,భాజాపాలు ప్రజలను చేసిన మోసంపై ఏపీ ప్రజలు రగిలిపోతున్నారు. ప్రత్యేకహోదా అనే అంశం ఇప్పుడు ప్రజల చేతుల్లోకి వెళ్లిపోయింది.
జగన్ ప్రత్యేకహోదా అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెల్తున్నారు. దాంతోపాటు విభజన చట్టంలోని హామీలఅమలుకు చిత్తశుద్ధితో పోరాడుతోంది. నిన్నటి వరకు అధికారపార్టీనాయకులు వ్యటకారంగా మాట్లాడారు. అయితితే ఇప్పుడు పరిస్థితి యూటర్న్ తీసుకుంది. ప్రత్యేకహోదా లేకుంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందదని జగన్ చెప్పడాన్ని ప్రజలు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు.
ఏపీ విభజన చట్టంలో ఇచ్చిన హామీలు, ప్రత్యేకహోదా విషయంలో విద్యార్థులు, నిరుద్యోగులు, కార్మికలు అందరూ జగన్కు జైకొడుతున్నారు. దీంతో ఇప్పుడు ఏంచేయాలో అధికారపార్టీ నాయకులకు దిమ్మతిరుగుతోంది. ప్రత్యేకహోదా సాధనకోసం వైసీపీ మార్చి 1 అన్ని జిల్లాల కలెక్టరేట్లను ముట్టడించే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
పార్లమెంట్ రెండో బడ్జెట్ సమావేశాలు మార్చి 5నుంచి జరగనున్నాయి. వైసీపీ ఎంపీలు మార్చి 3నే ఢిల్లీ బయలు దేరనున్నారు. ప్రత్యేకహోదా కోసం అవసరం అయితే రాజీనామాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని జగన్ ఇప్పటికే ప్రకటించారు. పార్టమెంట్ సమావేశాలు ప్రారంభం అయ్యోలోపు జగన్ కవలనున్నారు ఎంపీలు.
ప్రకాశంజిల్లాలో జగన్ పాదయాత్ర కొనసాగుతోంది. దర్శినయోజక వర్గంనుంచి ఢిల్లీ వెల్తున్న వాహణ శ్రేనికి జెండా ఊపి పంపనున్నారు. సమావేశాలు ప్రారంభానికి ముందే జంతర్మంతర్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ ధర్నాకు ఎంపీలతోపాటు, కార్యకర్తలు, ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొననున్నారు. దీంతో బాబుకు భజన తప్పదంటున్నారు విశ్లేషకులు.