ప్రస్తుత కాలంలో చాలా మంది ఉరుకుల పరుగుల జీవనానికి అలవాటు పడిపోయారు. కాలంలో పోటీ పడి మరీ.. పనిచేస్తున్నారు. కుటుంబ పోషణ కోసం.. ప్రెస్టేజి కోసం.. లక్ష్యం కోసం.. ఇలా రకరకాలుగా చాలా మంది సమయమయే లేనంతగా శ్రమపడిపోతున్నారు. కానీ తమ ఆరోగ్యం పట్ల మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవడమే మర్చిపోయారు.
ఆరోగ్యం బాగున్నప్పుడే ఏమైనా సాధిస్తాం.. ఎంత ఎత్తుకైనా ఎదగగలుతాం.. అందుకోసమే.. ఇకపై అన్నా.. మీ ఆరోగ్యం పట్ల తగిన శ్రద్ద వహించండని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎప్పుుడెప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోవాలనే విషయంపై అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి తీసుకునే ఆహారంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి తెలుపుతున్నారు.
రాత్రిపూట తేలిక పాలిటి ఆహారం తీసుకోవడం ఎంతో ముఖ్యమని చెబుతున్నారు. అంటే అరటిపండు, యాపిల్ పండ్లను తినడం వల్ల బాగా నిద్రపట్టడమే కాకుండా.. బాడీకి శక్తి కూడా వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. వీటితో పాటుగా కీరదోస కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటితో పాటుగా పీనట్ బటర్ టోస్ట్ ను కూడా రాత్రి పూట తినమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
Also Read : ఈ జాగ్రత్తలు తీసుకుంటే షుగర్ రాదట!