Monday, May 20, 2024
- Advertisement -

ఇప్పుడొచ్చారు….పున‌ర్ద‌ర్శ‌నం ఎప్పుడో….?

- Advertisement -

ప్ర‌శ్నించ‌డానికే జేసేన పార్టీని స్థాపించారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. ఆయ‌న ఎప్పుడు ప్ర‌శ్నిస్తారో ఆయ‌న‌కే తెలియ‌దు. కొన్ని రోజులు సినిమా షూటింగ్‌ల‌తో బిజీగా ఉండ‌టం….సినిమా పూర్తి అయిన త‌ర్వాత రెండు మూడు రోజ‌లుపాటు మ‌ల్లీ ప్ర‌జ‌ల‌ల్లోకి వ‌స్తారు అజ్ణాత వాసి ప‌వ‌న్‌. అది కూడా ప్ర‌భుత్వం ఇర‌కాటంలో ఉంటే దానినుంచి త‌ప్పించేందుకు బాబు డైరెక్స‌న్‌లో జ‌నంలోకి వ‌స్తారు. బాబు స్క్రిప్ట్‌ను చ‌ద‌వ‌డం….ప్ర‌తిప‌క్షంమీద విమ‌ర్శ‌లు చేయ‌డం ప‌రిపాటిగా మారింది.

ఇన్నాల్లు అజ్ణాత వాసి సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న ప‌వ‌న్ ఆసినిమా షూటింగ్ పూర్త‌యి ఆడియో విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. అధికూడా ఆంద్రాలో ఆడియో ఫంక్స‌న్‌ను నిర్వ‌హిస్తున్నారు. ఇంత‌లోనే హ‌టాత్తుగా ప్ర‌జా స‌మ‌స్య‌లమీద మ‌న‌సు మ‌ల్లింది. తాజాగా డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ప్రైవిటీకరణను వ్యతిరేకిస్తూ ఆత్మబలిదానం చేసిన ఉద్యోగి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు విజాగ్ వ‌చ్చారు ప‌వ‌న్‌. ప్ర‌యివీటీక‌ర‌న‌కు వ్య‌తిరేకంగా ఉద్యోగులు చేస్తున్న దీక్ష‌కు మ‌ద్దుతు తెలుపుతూ బాబుకు నొప్పి త‌గ‌ల‌కుండా స్పీచ్ దంచేశారు.

ప‌వ‌న్ రాజకీయాలను ఇంకా తీసుకోవాల్సినంత సీరియస్ గా తీసుకోవడం లేదన్న అప‌వాదు వ‌స్తోంది. ప‌వ‌న్ చేస్తున్న ప‌ర్య‌ట‌న‌లు ఏదో ఒక స‌మ‌స్య‌మీద త‌ప్ప రాష్ట్రంలో ఉన్న స‌మ‌స్య‌ల‌ను సీరియ‌స్ తీసుకోవ‌డంలేద‌నె విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

గ‌తంలో తిరుపతి పర్యటన కర్నాటక లో ఒక అభిమాని హత్యానంతరం సాగింది. శ్రీకాకుళ పర్యటన కిడ్నీజబ్బులగురించి, అమరావతిప్రాంత పర్యటన రైతులకు మద్ధతుగా సాగింది. దానికితోడు అనే క ముఖ్యమయిన సమస్యల మీద స్పందించకపోవడం కూడా చాలా మందిని నిరుత్సాహపరిచింది. వీటి కంటె ముఖ్య‌మైన స‌మ‌స్య‌లు చాలా ఉన్నాయి. ప్ర‌త్యేక‌హోదా, రైల్వేజోన్‌, పోల‌వ‌రం, ప్ర‌భుత్వంలో జ‌రుగుతున్న అవినీతి ఇలాంటి స‌మ‌స్య‌లు క‌న్పించ‌డ‌లేదు. బోటు ప్ర‌మాదంలో దాదాపు 22 మంది చ‌నిపోతే స్పందించ‌ని ప‌వ‌న్ తాజాగా వారిని ప‌రామ‌ర్శిస్తాన‌ని చెప్ప‌డం చూస్తే ఆయ‌న ప‌వ‌న్‌కు స‌మ‌స్య‌ల‌మీద ఎంత అవ‌గాహ‌న ఉందో తెలుస్తోంది.

వైజాగ్ పర్యటన కూడా ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగి ఆత్మబలిదానం జ‌ర‌గ‌క‌పోతే ఆయన వచ్చే వాడు కాదేమో…అనే విమర్శలు వ‌స్తున్నాయి . ప‌వ‌న్ ఉత్త‌రాంధ్ర ప‌ర్య‌ట‌న‌పై సోషియ‌ల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చారు స‌రే….మ‌ళ్లీ పున‌ర్ద‌ర్శ‌నం ఎప్పుడు …? అని చాలామంది ప్ర‌శ్నిస్తున్నారు.

అజ్ణాత‌వాసి సినిమా షూటింగ్‌లో మునిగిపోయిన ప‌వ‌న్ ఇప్పుడు అజ్ణాతం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు. సినిమా ఆడియో ఆంధ్రాలోనే కాబ‌ట్టి అటు ప్ర‌మోష‌న్ క‌ల‌సి వ‌స్తుంది…ఇటు రాజ‌కీయంగా ల‌బ్ధి పొంద‌డం చూస్తే ..ఒకే దెబ్బ‌కు రెండు పిట్ట‌ల‌న్న‌ట్లు ఉంది ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -