ఈ మధ్య లగ్జరీ లైఫ్ లకు బాగా అలవాటు పడిన వాళ్లు.. చేయకుడని పనులు చేస్తున్నారు. అందువల్ల నేరస్తులుగా మారుతున్నారు. ఇక డబ్బు మాత్రమే ముఖ్యం అనేవిధాంగా ఆలోచించి.. అందుకోసం.. ఏ పని చేయడానికైన తెగిస్తున్నారు. సుఖం కోసం కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి చంపించింది ఓ భార్య.. ఈ దారుణ సంఘటన కర్ణాటకలో జరిగింది.
{loadmodule mod_custom,Side Ad 1}
అసలు విషయంలోకి వేళ్తే.. కన్నడి టివి నటి కల్పన(27) భర్తతో కలిసి బెంగుళూర్ లో నివసిస్తుంది. కొంత కాలం వీరి సంసారం సాఫీగా సాగింది. అయితే గత కొంత కాలంగా కల్పనకు జావేద్ అనే వ్యక్తితో పరిచయం అయ్యింది. కాగా భర్త సతీష్ (36) ఓ ప్రయివేట్ సెక్యూరిటీ సంస్థ లో సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాడు. భర్త లేని టైంలో జావేద్ వచ్చిపోవడం.. వీరి విలాసానికి అడ్డూ అదపు లేకుండా పోయింది. అయితే ఈ విషయం భర్త సతీష్ కు తెలియడంతో వార్నింగ్ ఇచ్చాడు.
{loadmodule mod_custom,Side Ad 2}
దీంతో తమ అక్రమ సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడని తెలుస్కొని ఎలాగైనా అతని అడ్డు తొలిగించుకోవాలని డిసైడ్ అయ్యింది. ప్లాన్ ప్రకారం భర్తకు నిద్ర మాత్రలు ఇచ్చిన తర్వాత మత్తులోకి జారుకున్న తర్వాత జావేద్ ని పిలిచి భర్తని కిరాతకంగా చంపేసింది. ఎలాగో.. కల్పన నటి కావడంతో.. తన భర్త చనిపోయాడంటూ.. అందరినీ ఎంతో ఈజీగా నమ్మించాలని చూసింది. అంతే కాదు తన భర్త చావుకు కారణం ఎవరో తెలుసుకోవాలని పోలీసులకు ఆశ్రయించింది. ఇక రంగంలోకి దిగిన పోలీసులు తమదైన పద్దతిలో కల్పనను నిలదీయగా అసలు విషయం బయట పెట్టింది. ఇప్పుడు టీవీ నటి కల్పనతో పాటు ఆమె ప్రియుడు కూడా జైలుకు వెళ్లారు.
{youtube}72JDV4JCAoA{/youtube}
{loadmodule mod_sp_social,Follow Us}
Related