Friday, May 17, 2024
- Advertisement -

లోకేష్ మానవత్వం షో…… అట్టర్ ఫ్లాప్ అయింది

- Advertisement -

టిడిపిలో సినిమా జనాలు ఎక్కువ. పార్టీ స్థాపించిన ఎన్టీఆర్ కూడా చంద్రబాబు లాగా ఎప్పుడూ సినిమా వాళ్ళపైన ఆధారపడింది లేదు. కానీ చంద్రబాబుకు మాత్రం అన్నీ సినిమావాళ్ళే. పుష్కరాల్లో తనను సింహా స్థాయి మాస్ హీరోగా ప్రజెంట్ చేయడానికి బోయపాటి కావాలి, బాహుబలితో ఇండియా మొత్తం నుంచి అభిమానులను సంపాదించుకున్న రాజమౌళిచేత చంద్రబాబు పాలనకు నేను అభిమానిని అని చెప్పించాలి. ఇక ఆస్థాన భజన బృందం పరుచూరి బ్రదర్స్, రాఘవేంద్రరావులు తన ప్రసంగాల స్క్రిప్ట్స్ రెడీ చేస్తూ ఉండాలి. అందుకే రుద్రమదేవి సినిమాను కాదని రాఘవేంద్రరావు కొడుకు దర్శకత్వం వహించిన సైజ్ జీరో సినిమాకు గాను అనుష్కకు ఉత్తమనటి అవార్డ్ ఇచ్చారు. సైజ్ జీరోలో తన నటన తనకే నచ్చలేదని వాపోయే అనుష్క కూడా ఈ నంది దెబ్బకు షాకయ్యి ఉంటుంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న రుద్రమదేవిలాంటి వీరోచిత యాక్టింగ్‌కి అవార్డ్ రాకపోవడంతో హతాశురాలయ్యే ఉంటుంది. టిడిపి సిత్రాలు అలానే ఉంటాయి మరి. ప్రతిభతో అస్సలు పనిలేదు…….వాడు మనవాడు అయ్యి ఉండాలన్నది అసలు పాలసీ. నంది అవార్డులు అయితేనేం, కృష్ణా పుష్కరాలు అయితేనేం, రాజధాని డిజైన్స్ అయితేనేం, పట్టిసీమ ప్రచారం అయితేనేం…టిడిపి షో మాత్రం చాలా మందికి వెగటు పుట్టిస్తోంది.

ఇక ఇప్పుడు చినబాబు నారా లోకేష్ కూడా మరో రకమయిన షోతో మన ముందుకు వచ్చాడు. మానవత్వంలో మదర్ థెరిస్సాకంటే గొప్పవాడిని అనే స్థాయిలో తన డబ్బా తానే కొట్టుకునే చంద్రబాబులాగే ఇప్పుడు లోకేష్ కూడా సొంత షో ఒకటి తన భజన మీడియా ద్వారా జనాలకు చూపించాడు. రాజకీయ అరంగేట్రం నుంచీ కూడా ‘పప్పు’ అని అన్ని వైపుల నుంచీ విమర్శలు ఎదుర్కోవడం, చంద్రబాబుకు కూడా లోకేష్ ప్రతిభపైన భయంకరమైన నమ్మకం కాబట్టే ఎందుకైనా మంచిదని 2009 ఎన్నికల ప్రచారంలో అద్భుత వాక్పటిమతో తాతకు తగ్గ మనవడు, నాయకుడు అనిపించుకున్న ఎన్టీఆర్‌ని తొక్కేశాడన్న విషయాలు అందరికీ తెలిసినవే. అందుకే టిడిపి మీడియా కూడా లోకేష్‌లో లేని గొప్పలక్షణాలను కూడా చూపిస్తే చంద్రబాబును ప్రపంచ స్థాయి నాయకుడిగా ప్రచారం చేసినట్టుగానే లోకేష్‌ని కూడా నిలబెట్టాలన్న ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అయితే లోకేష్‌కి మాత్రం కనీస స్థాయి సామర్థ్యం కూడా లేక తన ప్రసంగాలతోనూ, అలాగే తన యుక్త వయసులో నడిపిన సరస సల్లాపాల ఫొటోలతోనూ ఇమేజ్‌ని డ్యామేజ్ చేసుకుంటూ ఉన్నాడు. అయితేనేం లోకేష్‌ని గొప్పవాడిగా చూపించడానికి ఎల్లో మీడియా మాత్రం భయంకర ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది.

తాజాగా పట్టిసీమ యాత్రపేరుతో టిడిపి ఎమ్మెల్యేలు, మంత్రులతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఓ షో చూపించాడు చంద్రబాబు. ఈ పట్టిసీమ అంతా అవినీతి వ్యవహారం అని కాగ్ కడిగిపారేయడంతో, పట్టిసీమ అవినీతి గురించి పల్లెసీమల జనాలకు కూడా తెలిసిపోవడంతో పట్టిసీమ ప్రపంచంలోనే గొప్పది అని జనాలను నమ్మించడానికి చంద్రబాబు మూడేళ్ళుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. అందులో భాగమే ఈ తాజా షో కూడా. అయితే ఆ షోకు అందరూ కలిసి బస్సులో వెళితే లోకేష్ మాత్రం ప్రత్యేకంగా తన కాన్వాయ్‌లో వెళ్ళారు. ఆ కాన్వాయ్‌లో వెళ్ళడానికి టయోటాతో ఒప్పందం కారణమని చెప్పుకొచ్చారు. ఇక లోకేష్ కాన్వాయ్ ఒక అంబులెన్స్‌కి దారి ఇచ్చింది అని చెప్పి ఎల్లో మీడియా మొత్తం లోకేష్‌ని మదర్ థెరిస్సా స్థాయి మానవత్వం ఉన్న మనిషిగా. నాయకుడిగా చూపించే ప్రయత్నం చేస్తోంది.

అయితే ఆ వీడియోలో ఉన్న ఫుటేజ్ కాస్తా కామెడీ అయిపోయింది. లోకేష్ షో అట్టర్ ఫ్లాప్ అయింది. విశాలమైన రోడ్డు…..ట్రాఫిక్ కూడా ఏమీ లేదు…..అలాంటి రోడ్డుపై లోకేష్ కాన్వాయ్‌లో ఉన్న ఈజీగా వంద…నూటా యాభై కిలోమీటర్ల స్పీడ్‌తో వెళ్ళగలిగే వెహికల్స్….గట్టిగా అరవై-ఎనభై స్పీడ్‌తో కూడా వెళ్ళలేని చిన్న వాహనానికి దారి ఇస్తాయి. ఇక్కడే నెటిజనులకు ఇది ముందుగా ప్లాన్ చేసిన ప్రచార షో అన్న విషయం అర్థమైపోయింది. అలాగే ఆ టైంలో….రోడ్డుపై ఈ వీడియోను ఎవరు షూట్ చేశారు అన్న ప్రశ్న కూడా అనుమానాలు రేకెత్తిస్తోంది. కావాలంటే మీరూ ఆ వీడియో చూడండి. మీకే అర్థమవుతుంది. సోషల్ మీడియాలో పేలుతున్న సెటైర్స్, పడుతున్న విమర్శల చూసిన తర్వాత అయినా నెక్ట్స్ టైం ఇలాంటి షోలను లోకేష్ ఇంకాస్త జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటాడేమో చూడాలి మరి. లేకపోతే కామెడీ అయిపోతుంది మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -