టెలికం రంగంలో రిలయన్స్ జియో ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఉచిత డేటా, కాల్స్ ఇవ్వడంతో రిలియన్స్ జియోకి వినియోగదారులు ఒక్కసారిగా పెరిగారు. ఆ తర్వాత జియో తక్కువ ధరకే.. ఎక్కువ కాలం డేటా, కాల్స్ ఇవ్వడంతో జియో మళ్లీ సంచలనం సృష్టించింది.
దీంతో ఇతర టెలికం కంపెనీలు కూడా తమ వినియోగదారులను కపాడుకునేందుకు తమ వంతు ప్రయత్నాలు చేసినా.. జియో ముందు నిలవలేకపోతున్నాయి. అయితే అంత బానే ఉంది అనుకుంటున్న సమయంలో జియో ఇప్పుడు తమ వినియోగదారులకు పెద్ద షాకివ్వనుంది. ఇటీవలే 15 నుంచి 20శాతం మేరకు రేట్లు పెంచిన రిలయన్స్ జియో… మరోమారు ధరలు పెంచేందుకు రెడీ అయింది. వచ్చే జనవరిలో మరోసారి జియో టారిఫ్లు పెంచే అవకాశం ఉందని తన తాజా నివేదికలో పేర్కొనట్టు అమెరికాకు చెందిన బ్రోకరేజ్ సంస్థ గోల్డ్మన్ శాచె వెల్లడించింది.
దీంతోపాటే ప్రస్తుతం 49 రోజులున్న రూ.309 ప్యాకేజీ గడువును జియో వచ్చే జనవరి నుంచి 28 రోజులకు కుదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జియో ఇలా చేయడంతో.. ఇతర టెలికం కంపెనీలు కూడా ధరలు పెంచే అవకాశం ఉంది. మరి అలా అయితే మళ్లీ డేటా కోసం డబ్బులు అధిక మొత్తంలో ఖర్చు చేయాల్సిందే.