టాలీవుడ్లో చాన్స్ కోసం ఓ మైనర్ బాలిక ఎదురు చూస్తోంది. అయితే ఆమెకు హీరోయిన్ చాన్స్ ఇప్పిస్తామని ఐదుగురు వ్యక్తులు ఆమెపై 17 రోజుల పాటు గ్యాంగ్ రేప్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. టాలీవుడ్లో మంచి డాన్సర్ గా ఆఫర్ కోసం బాలిక(15) బంజారాహిల్స్ రోడ్ నెం. 2లోని ఇందిరానగర్లో నివాసముండే మేనమామ ఇంటికి వచ్చింది.
ఈ నెపథ్యంలో ఆమె బలహీనతను ఆసరాగా తీసుకున్న నలుగురు యువకులు బాలికపై కన్నేశారు. ఆమె డాన్సర్ గానే కాకుండా ఏకంగా సినిమాల్లో హీరోయిన్ ఛాన్స్ ఇప్పిస్తామని నమ్మించారు. ఇందిరానగర్లో నివసిస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్ షేక్ అక్బర్(21), తూము వెంకారెడ్డి(22), ప్రొడక్షన్ అసిస్టెంట్గా పని చేస్తున్న నండూరి పాపారావు అలియాస్ గణేష్(31) మోయినాబాద్వాసి గుడుపల్లి నవీన్కుమార్(19) ఆ బాలికను మభ్యపెట్టి ఈ నెల 3వ తేదీన రంగారెడ్డి జిల్లా నందిగామకు తీసుకెళ్లారు.
అక్కడ ఈ నలుగురు మరో వ్యక్తి కలిశాడు. ఈ ఐదుగురు ఆమెను ఇందిరానగర్తో పాటు చింతల్, జీడిమెట్ల, నందిగామ తదితర ప్రాంతాలకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫోన్ నంబర్ల ఆధారంగా నిందితులను అరెస్టు చేశారు. కుమార్ పరారీలో ఉండగా మిగతా నలుగురిని ఐపీసీ సెక్షన్ 376(డి), సెక్షన్ 5(జి), రెడ్విత్ 6, పోక్సో యాక్ట్ కింద కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.
Related