ఆస్ట్రేలియాతో జరుగుతున్న టి-20 సిరీస్లో రెండో మ్యాచ్ ఈ రోజు జరగనుంది. బెంగళూరు వేదిక ఈ రెండు జట్ల మధ్య రెండో టి-20 మ్యాచ్కు రెడీ అవుతున్నాయి. వైజాగ్లో జరిగిన మొదటి టి-20 మ్యాచ్లో భారత్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో భారత్ 126 పరుగులు మాత్రమే చేసింది. ఆసీస్ కూడా ఈ తక్కువ స్కోరును చేదించడానికి అఖరి బంతి వరకు ఆడింది. ఇక మ్యాచ్లో కూడా విజయం సాధించి సిరీస్ను గెలవలని ఆసీస్ జట్టు భావిస్తోంది. ఇటు భారత్ కూడా ఈ మ్యాచ్లో విజయం సాధించి సిరీస్ను సమం చేయలని చూస్తోంది.
మొదటి మ్యాచ్లో భారత్ బ్యాంటిగ్ వైఫల్యం వల్లే ఓడిపోయిందని కెప్టెన్ కోహ్లీ తెలిపాడు. ఈ మ్యాచ్లో ఇండియన్ బౌలర్లు అద్బుతంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా పేస్ బౌలర్ బుమ్రా తన బౌలింగ్తో మ్యాచ్పై ఆశలు రేపాడు. ఈ మ్యాచ్లో వైస్ కెప్టెన్ రోహిత్ శర్మకు విశ్రాంతినిచ్చే యోచనలో ఉంది. వికెట్ కీపర్ బ్యాట్స్మన్ రిషభ్ పంత్, పేసర్ ఉమేశ్ యాదవ్ స్థానాల్లో ఆల్రౌండర్ విజయ్ శంకర్, పేసర్ సిద్థార్థ్ కౌల్ను తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. రాత్రి 7 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం
- Advertisement -
ఆసీస్తో రెండో టి-20 నేడే, సమం చేస్తారా లేక సమర్పిస్తారా..?
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -