Monday, April 29, 2024
- Advertisement -

ఐపీఎల్ వేలం తుదిజాబితాలో సచిన్ తనయుడికి చోటు!

- Advertisement -

టీమిండియా మాజీ కెప్టెన్‌, పరుగులు వీరుడు సచిన్ టెండూల్కర్‌ కొడుకు అర్జున్ టెండూల్కర్ తన కల నెరవేర్చకున్నట్టే అంటున్నారు. ఇటీవల విజయ్ హజారే ట్రోఫీ కోసం ప్రకటించిన ముంబయి జట్టులో సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్ కు స్థానం లభించలేదు. దాంతో నిరాశలో ఉన్న ఈ కుర్ర క్రికెటర్ కి ఐపీఎల్ వేలంలో పరిస్థితి ఏమిటన్నదానిపై అనిశ్చితి ఏర్పడింది.

ఈ నేపథ్యంలోనే ముంబయి జట్టులో కూడా స్థానం దక్కించుకోలేని అర్జున్ ను ఐపీఎల్ వేలానికి పరిగణనలోకి తీసుకోవడం కష్టమేనని అన్నారు. అయితే అర్జున్ టెండూల్కర్ కు ఊరట కలిగించేలా అతడి పేరును ఐపీఎల్ వేలం తుదిజాబితాలో చేర్చారు. మొత్తానికి ప్రారంభ ధర రూ.20 లక్షల కింద ఆల్ రౌండర్ల కేటగిరీలో అర్జున్ టెండూల్కర్ పేరు నమోదైంది.

మొత్తం 292 మంది క్రికెటర్లు తుది జాబితాలో చోటు సంపాదించుకోగా, వారిలో 21 ఏళ్ల అర్జున్ కూడా ఉన్నాడు. 2020-21 సీజన్ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ ద్వారా టీ20 క్రికెట్ లో అరంగేట్రం చేశాడు అర్జున్ టెండూల్కర్. ఈ నెల 18న చెన్నైలో ఐపీఎల్ వేలం నిర్వహించనున్నారు. 

పెళ్లి పీట‌లు ఎక్కబోతున్న‌ మ‌హాన‌టి !

దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం.. పరుగులు తీసిన జనం

అరకులో ఘోర రోడ్డు ప్రమాదం…!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -