మరి కొన్ని గంటల్లో ప్రపంచకప్ లో భాగంగా ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా భారత్, న్యూజిలండ్ మధ్య తొలి సెమీఫైనల్స్ సమరం జరగనుంది. పాయంట్ల పట్టికలో మొదటిస్థానంలోఉన్న కోహ్లీసేన నాలుగో స్థానంలో ఉన్న కీవీస్తో తలపడనుంది. వర్షం కారణంగా లీగ్ ఇద్దరి మ ధ్య లీగ్ మ్యాచ్ రద్దు అయిన సంగతి తెలిసిందే. సెమీపైనల్కు కూడా వరణుడి ముప్పు ఉంటుందని అక్కడి వాతావరణశాఖ అధికాలు వెల్లడించారు.
టీమిండియాకు విరాట్ కోహ్లీ సారథ్యం వహిస్తుండగా… న్యూజిలాండ్ కెప్టెన్ గా కేన్ విలియమ్స్ జట్టును నడిపిస్తున్నాడు. మరోవైపు, టీమిండియా జట్టులోకి యజువేంద్ర చాహల్ వచ్చే అవకాశం కనపడుతోంది. రవీంద్ర జడేజా స్థానంలో చాహల్ కు అవకాశం లభించే ఛాన్స్ ఉంది. 7 మ్యాచుల్లో 6 వికెట్లు మాత్రమే తీసినప్పటికీ… కుల్దీప్ యాదవ్ కు జట్టులో స్థానం కల్పించవచ్చు. ఐదుగురు బౌలర్ల ఫార్ములాతో ఆడాలనుకుంటున్న టీమిండియా భువనేశ్వర్ కుమార్ కు కూడా అవకాశం ఇవ్వచ్చు. రెండు టీముల తుది కూర్పు ఈ విధంగా ఉండవచ్చు.
మిండియా:
రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), రిషభ్ పంత్, ధోనీ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, యజువేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా.
న్యూజిలాండ్:
మార్టిన్ గుప్టిల్, కొలిన్ మన్రో, కేన్ విలియంసన్ (కెప్టెన్), రాస్ టేలర్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), జేమ్స్ నీషమ్, కొలిన్ గ్రాండ్ హోమ్, మిచెల్ శాంట్నర్, మాట్ హెన్రీ, ఫెర్గ్యూసన్, ట్రెంట్ బౌల్ట్