ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటేనే కాసుల టోర్నీ. సంపాదనే ఈ లీగ్ ధ్యేయం. ఐపీఎల్ ద్వారా కేవలం ఫ్రాంచైజీలు, బీసీసీఐ మాత్రమే ఆర్జించాలా..? మేం కాదా..? అంటూ బెట్టింగ్ రాయుళ్లు చెలరేగిపోతారు. ఐపీఎల్ సీజన్ మొత్తం ఈ బెట్టింగ్ దందా ఓ రేంజులో జరుగుతుంది. వీరిలో పోలీసులకు పట్టుబడేవారు ఎంతమందో.. పట్టుబడనివారు ఎంతమందో కచ్చితంగా చెప్పలేం.
ఇటీవల జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో బెట్టింగ్ స్కామ్ వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ సోదరుడు, నిర్మాత అర్బాజ్ ఖాన్కు మహారాష్ట్రలోని థానే పోలీసులు సమన్లు జారీ చేయగా, ఆయన హాజరయ్యాడు. తాను బెట్టింగ్కు పాల్పడినట్లు అంగీకరించాడు.
బెట్టింగ్ బుకీ సోనుకి తనకు గత ఆరేళ్ల నుంచి పరిచయం ఉందని అర్బాన్ ఖాన్ ఒప్పుకున్నట్లు తెలిసింది. సోనుతో ఆయన చేసిన చాటింగ్, ఇతర బుకీలతో కలిసి వీరిద్దరు దిగిన ఫోటోలు పోలీసులకు లభ్యమయ్యాయి. అలాగే, గతేడాది తాను ఐపీఎల్ మ్యాచ్లో బెట్టింగ్ పెట్టి రూ.2.75 కోట్లు నష్టపోయానని అర్బాన్ అంగీకరించాడు. గత కొంత కాలంగా తాను బెట్టింగ్లో డబ్బులు పెడుతున్నానని ఆయన అంగీకరించినట్లు ఈ కథనాలు ఉటంకించాయి.
కాగా, ఇటీవల జరిపిన విచారణలో సోను అర్బాజ్ఖాన్ పేరును బయటపెట్టి, ఆయన బెట్టింగ్లో రూ.2.8 కోట్లు కోల్పోయాడని అన్నాడు. చివరకు డబ్బు ఇవ్వకపోవడంతో ఆయనను తాను బెదిరించానని అన్నారు. బుకీలతో సంబంధాలపై తొలుత బుకాయించిన అర్బాజ్ ఖాన్.. జలన్ బెదిరిస్తూ చేసిన చాటింగ్ చూపించే సరికి అసలు విషయం వెల్లడించాడని తెలుస్తోంది.