భారత్తో ఫిరోజ్ షా కోట్ల వేదికగా తొలి టీ20 మ్యాచ్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటికే ముగిసిన మూడు వన్డేల సిరీస్ని 2-1తో చేజిక్కించుకున్న భారత్ ఫుల్ జోష్మీదుండగా.. ఒత్తిడిలోనే న్యూజిలాండ్ బరిలోకి దిగుతోంది.
కెరీర్లో చివరి మ్యాచ్ ఆడుతున్న ఆశిష్ నెహ్రాకి భారత్ తుది జట్టులో కోహ్లి అవకాశం ఇచ్చాడు. శ్రేయాస్ అయ్యర్ ఈ టీ20తో టీమిండియాలోకి అరంగేట్రం చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఐదు సార్లు ఈ రెండు జట్లు టీ20 మ్యాచ్ల్లో తలపడగా.. ఐదింట్లోనూ కివీస్దే పైచేయిగా నిలిచింది.
టీ20ల్లో 125 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న న్యూజిలాండ్ను ఓడించాలంటే టీమిండియా కష్టపడాల్సిందే. టీ20 ఫార్మాట్లో భారత్ (116) ఐదో స్థానంలో ఉంది. న్యూజిలాండ్తో టీ20ల్లో భారత్ గెలిస్తే భారత్ రెండో స్థానానికి చేరుకుటుంది.
భారత్ తుది జట్టు: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, ధోని, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, ఆశిష్ నెహ్రా, బుమ్రా, చాహల్
న్యూజిలాండ్ తుది జట్టు: గప్తిల్, మున్రో, విలియమ్సన్, బ్రూసీ, లాథమ్, నికోలస్, గ్రాండ్హోమ్, శాంట్నర్, సౌథీ, బౌల్ట్, సోథీ.