- Advertisement -
సొంత గడ్డపై న్యూజిలాండ్ వన్డే సిరీస్ను కోల్పోయింది. ఐదు వన్డేల సిరీస్లో భాగంగా భారత్ వరుసగా మూడు వన్డేలు గెలిచి సిరీస్ను కైవసం చేసుకుంది. చివరి రెండు వన్డేలను గెలిచి పరువు నిలుపుకోవాలని చూస్తోంది. అందులో భాగంగానే జట్టులో స్వల్ప మార్పులు చేసింది.
ఇష్ సోధీ, బ్రాస్వెల్ను జట్టు నుంచి తప్పించిన కివీస్.. వారి స్థానంలో జేమ్స్ నీషామ్, టాడ్ ఆస్ట్లేలకు అవకాశం కల్పించింది. గాయం కారణంగా వీరిద్దరూ తొలి మూడు వన్డేలకు దూరమయ్యారు. ఏడాదిన్నర విరామం తర్వాత క్రికెట్లోకి అడుగుపెట్టిన నీషామ్.. ఇటీవల శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్లో సత్తా చాటి జట్టును విజయంలో కీలక పాత్ర పోషించాడు. లంకపై వరుసగా మూడు వన్డేల్లో 47, 64, 12 చొప్పున పరుగులు చేసి ఆరు వికెట్లు పడగొట్టాడు.