Tuesday, May 14, 2024
- Advertisement -

సోషియ‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న అఖ్త‌ర్‌ ట్విట్‌…

- Advertisement -

రెండు రోజుల కింద‌ట అంత‌ర్జాతీయ క్రికెట్‌కు ఆశిష్ నెహ్రా రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. న్యూజిలాండ్‌తో జ‌రిగిన మొద‌టి టీ20 మ్యాచ్‌లో ఆడిన నెహ్రా త‌న సొంత‌మైదానం ఢిల్లీలోని ఫిరోజ్‌షాకోట్ల మైదానంలో నెహ్రాకు వీడ్కోలు ప‌లికారు ఆట‌గాల్లు. ఇప్ప‌టికె ప‌లువురు క్రికెటర్లు సోషియ‌ల్‌మీడియాలో అభినందిస్తూ ప‌లు పోస్ట్‌లు పెట్టిన సంగ‌తి తెలిసిందే.

అయితె తాజాగా పాకిస్థాన్ ఫాస్ట్ బౌల‌ర్ షోయ‌బ్ అఖ్త‌ర్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో నెహ్రా రిటైర్‌మెంట్‌పై పెట్టిన పోష్ట్ ఇప్పుడు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. 38 ఏళ్ల వయసున్న నెహ్రా, సొంత మైదానమైన న్యూఢిల్లీ ఫిరోజ్ షా కోట్లాలో న్యూజిల్యాండ్ తో టీ-20ని ఆడి తన 18 ఏళ్ల క్రికెట్ కెరీర్ కు ముగింపు పలికిన సంగతి తెలిసిందే.

నెహ్రా రిటైర్ మెంట్ పై అఖ్తర్ స్పందిస్తూ, తనతో పాటు ఆడిన నీతిమంతమైన ఫాస్ట్ బౌలర్లలో నెహ్రా ఒకడని కొనియాడాడు. ఆయనతో కలసి ఆడటం తనకెంతో ఆనందాన్ని కలిగించిందని, నెహ్రా స్వతహాగా ఓ మంచి వ్యక్తని అన్నాడు. తదుపరి నెహ్రా తన జీవితాన్ని ఆనందంగా గడపాలని కోరుకుంటున్నట్టు చెప్పాడు. తన కెరీర్ లో పలుమార్లు ఎత్తు పల్లాలను ఎదుర్కొన్న నెహ్రా, ఫిట్ నెస్ నిరూపించుకుని తిరిగి మెయిన్ టీమ్ లో స్థానం పొందిన సందర్భాలు అనేకం ఉన్నాయ‌ని పోస్ట్‌లో తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -