బ్యాడ్మింటన్ ర్యాంకుల్లో సింధూ,సైనా ర్యాంకులు దిగజారాయి.గతవారం ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో సెమీఫైనల్ చేరడంలో విఫలమైన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ర్యాంకుల్లో వెనుకబడింది. తాజాగా ప్రకటించిన బీడబ్ల్యూఎఫ్ ర్యాం కింగ్స్లో మహిళల సింగిల్స్లో సింధు ఓ స్థానం కోల్పోయి 4వ ర్యాంకులో నిలిచింది. మరోవైపు ఆసియా టోర్నీలో తొలిరౌండ్లోనే వెనుదిరిగిన మాజీ నంబర్వన్ సైనా నెహ్వాల్ కూడా ఓ స్థానం చేజార్చుకొని 9వ ర్యాంకులో కొనసాగుతున్నది.
పురుషుల సింగిల్స్లో అజయ్ జయరామ్ 13వ ర్యాంకులో నిలిచి భారత్ తరఫున అత్యుత్తమ ర్యాంకర్గా కొనసాగుతున్నాడు. సింగపూర్ ఓపెన్ చాంపియన్ సాయి ప్రణీత్ ఓ స్థానం మెరుగుపరచుకొని 22వ ర్యాంకుకు చేరాడు. శ్రీకాంత్, సమీర్ వర్మలు వరుసగా 26, 27వ ర్యాంకుల్లో ఉన్నారు. మహిళల డబుల్స్లో సిక్కిరెడ్డి-అశ్విని జోడీ 28వ ర్యాంకులో, పురుషుల డబుల్స్లో సుమిత్-మను జంట 25వ ర్యాంకులో, మిక్స్డ్ డబుల్స్లో సిక్కి-ప్రణవ్ 16వ ర్యాంకులో నిలిచారు.
Related