Monday, April 29, 2024
- Advertisement -

స్వదేశానికి కోహ్లీ..

- Advertisement -

వరల్డ్ కప్ తర్వాత వన్డే,టీ20లకు దూరమైన స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌కు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ప్రాక్టీస్ కూడా ప్రారంభించగా అనూహ్యంగా శుక్రవారం స్వదేశానికి తిరుగు పయనమయ్యాడు. అయితే విరాట్ సడన్‌గా భారత్‌కు పయనం కావడం చర్చనీయాంశంగా మారగా దీనిపై బీసీసీఐ ఎలాంటి ప్రకటన చేయలేదు.

అయితే విరాట్ ఈ నెల 26 నుండి ప్రారంభమయ్యే తొలి టెస్టుకు అందుబాటులో ఉంటాడని వెల్లడించింది బీసీసీఐ. విరాట్ కుటుంబంలో ఏదైనా ఎమర్జెన్సీ ఉందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.మరోవైపు దక్షిణాఫ్రికాతో రెండో వన్డే సందర్భంగా రుతురాజ్‌ గైక్వాడ్‌ చేతి వేలికి గాయం కారణంగా జట్టుకు దూరం అయ్యాడని తెలిపారు.

ఇక దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ డ్రా ముగియగా వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది టీమిండియా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -