ఈమె నా లక్కీ ఛార్మ్ అంటూ భారత క్రికెటర్ రోహిత్ శర్మ తాజాగా తన భార్య రితికతో దిగిన ఓ ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. రితిక అంటే రోహిత్కు ఎంతో ఇష్టం. ఎక్కడికి వెళ్లినా చెట్టాపట్టాలేసుకుని వెళ్తారు. చూడముచ్చటగా కనిపించే ఈ జంటకు అభిమానుల మనసుల్లో ప్రత్యేక స్థానం ఉంది. స్వదేశంలో లేదా విదేశంలో ఎక్కడికైనా సరే రోహిత్ క్రికెట్ కోసం వెళ్లినా రితిక పక్కన ఉండాల్సిందే. ఇద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించిందో వెల్లడించారు రోహిత్ శర్మ.
భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మకి జట్టులో సహచరుడైన యువరాజ్ సింగ్ గతంలో ఓ సరదా వార్నింగ్ ఇచ్చాడట. ఓ ప్రకటన షూటింగ్లో తొలిసారి రితికని చూసిన రోహిత్ శర్మ.. ముగ్దుడై ఆమె వైపే తదేకంగా చూస్తుండిపోయాడంట. దాంతో అక్కడే ఉన్న యువరాజ్ సింగ్ ‘అలా చూడొద్దు.. ఆమె నా చెల్లిలాంటిది’ అని హెచ్చరించాడట.
అయితే ఈ విషయాన్ని రోహిత్ శర్మనే ‘బ్రేక్ఫాస్ట్ విత్ ఛాంపియన్స్’ కార్యక్రమంలో తాజాగా వెల్లడించాడు. అయితే.. ఈ వార్నింగ్ తర్వాత తాను వెనక్కి తగ్గలేదని.. మరింత కోపంతో రితికని చూస్తూ ఉండిపోయానని ఈ ఓపెనర్ గుర్తు చేసుకున్నాడు.
యువరాజ్ సింగ్, ఇర్ఫాన్ ఫఠాన్లతో కలిసి ఓ ప్రకటన షూటింగ్ కోసం రోహిత్ వెల్లాడంట. అక్కడే తొలిసారి రితికని చూశాను. అప్పటికే యువీ, రితిక మంచి స్నేహితులు కావడంతో వారిద్దరూ మాట్లాడుకుంటున్నారు. అయితే.. వారికి కొంచెం దూరంగా కూర్చున్న నేను.. అక్కడ నుంచే రితికని తదేకంగా చూడటం మొదలెట్టాను. నా తీరుని గమనించిన యువరాజ్ సింగ్.. అలా చూడొద్దు ఆమె నా చెల్లిలాంటిది అని సరదాగా వార్నింగ్ ఇచ్చాడు.
దీంతో నాకు మరింత పట్టుదల పెరిగి.. కోపంతో ఆమెవైపే చూస్తూ ఉండిపోయాను. ఈ కారణంగా షూటింగ్లో ఏకాగ్రత దెబ్బతిని సరిగా నటించలేకపోయా. నా అవస్థని గమనించిన రితిక స్వయంగా వచ్చి ఏమైనా సహాయం కావాలా..? అని అడిగింది. అదే మా ఇద్దరి మధ్య మొదటి సంభాషణ. ఆ తర్వాత.. ఇద్దరం మంచి స్నేహితులుగా మారి.. పెళ్లి చేసుకున్నాం’ అని రోహిత్ శర్మ వివరించాడు. ఇటీవల మొహాలి వన్డేలో సాధించిన డబుల్ సెంచరీని భార్య రితికకి రోహిత్ శర్మ అంకితం చేసిన విషయం తెలిసిందే.