- Advertisement -
తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కేసుల సంఖ్య 3 లక్షలను దాటేసింది. ఇప్పటికే రాష్ట్రంలో ఎంతోమంది మంత్రులు, ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడ్డారు. తాజాగా గిరిజన అభివృద్ధి శాఖ, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కు కరోనా సోకింది.
తాజాగా కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్ అని నిర్ధరణ అయిందని వైద్యాధికారులు తెలిపారు. నాలుగు రోజులుగా మంత్రి జ్వరంతో బాధపడుతుండగా కొవిడ్ పరీక్ష చేశారు. ఇటీవల రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతుండగా… మంత్రికి కరోనా నిర్ధరణ కావడం కలకలం రేపింది.
రాష్ట్రంలో మరో 111 కరోనా కేసులు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 27 మంది కొవిడ్ బారిన పడ్డారు.మహమ్మరితో మరొకరు మృతిచెందారు.
హైదరాబాద్ లో బంగారం హవా.. ఎంత ఉందో తెలుసా..!
టిఆర్ఎస్ కు ఓటేస్తే ఎవ్వరికి వేసినట్టు అవుతుందో అర్థం చేసుకోవాలంటూ ప్రశ్న..!