రాజకీయాలకి కొత్త అర్ధం చెప్పి.. కాంగ్రెస్ నావను ఒడ్డుకు చేర్చిన రాజకీయ నాయకుడు ఆయన. తెలుగు జాతి గుండెల్లో కొలువైన నేత వైఎస్ఆర్. ఆయకు ప్రతి మనిషి బాధ తెలుసు. ఎవరికి బాధలేకుండా చేయడానికి ప్రతినిమిషం కష్టపడేవారు. అందుకే..ముందు పేదవాడి ఆకలి.. ఆ తరువాతే ఉన్నోడి అవసరం అని నమ్మి ముందుకెళ్లిన జన నేత వైఎస్ఆర్. ఆయన చల్లని చూపు పేదవాడిని ఆకలి తీర్చటంపై ఉంటుంది. అందుకే ఆయన జనం గుండెల్లో ఇంకా ఉన్నారు.
పదవులున్నా లేకున్నా, అధికారపక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా తనలోని ‘మంచితనం’ అనే దీపం ఆరిపోకుండా కాపాడుకొని నిరుపేదల గుండెల్లో వెలుగులు నింపారు దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి. అయితే.. వైఎస్ఆర్ రాజకీయాల్లో ఎలా ఎత్తుకు పై ఎత్తులు వేస్తారో.. సామాన్యుడి విషయంలో, మిత్రుల విషయంలో, కుటుంబం విషయంలో అంతే అప్యాయంగా ఉంటారు. ఆయన స్నేహనికి, బంధాలకు ఎంతో విలువిస్తారు. వైఎస్ఆర్కి కుటుంబం అంటే ఎంతో ప్రీతి.. ఆయన ఏ కార్యక్రమం చేపట్టినా.. విజయమ్మ హరతితోనే ప్రారంభిస్తారు. ఇంటి నుంచి బయటకి వెళ్లాలంటే.. విజయమ్మ ఎదురు రావాల్సిందే. అంతగా కుటుంబానికి వారికి విలువ ఇస్తారు వైఎస్ఆర్. బంధాలు అంటే అంత ఇష్టం ఆయనకి. అయితే వైఎస్ఆర్ తన కొడుకు జగన్, షర్మిలపై కూడా ఎంతో ప్రేమ చూపిస్తారు. ఓసారి ఇంటర్వూలో తన తన కూతురు గురించి పలు విషయాలు చెప్పారు వైఎస్ఆర్. నా కూతురు వైయస్ షర్మిల అంటే నాకు ప్రాణం.
నా ధైర్యం కూడా ఆమె. అందుకే షర్మిలను `మమ్మీ` అని ప్రేమగా పిలుచుకుంటాను“ అని దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ఓ సందర్భంలో అన్నాపు. అలానే జగన్ ని కూడా వైఎస్ ఎప్పుడూ ఓ చిన్నపిల్లవాడిగా చూసుకుంటారు. ఓ సారి సభలో కూడా జగన్ ముక్కుపచ్చలారని చిన్న పిల్లోడు వాడు.. ఏదో తన చదువుకు తగ్గట్టుగా నీతిగా వ్యాపారం చేసుకుంటున్నాడు. అలాంటి నా కొడుకు మీద నిందలు వేస్తారా అంటూ అసెంభ్లీ సాక్షిగా ఫైర్ అయ్యారు. అయితే వైఎస్ఆర్ కి జగన్ అంటే ఎంతో ఇష్టం. వైఎస్ఆర్ షర్మిలను మమ్మీ అని పిలిస్తే.. జగన్ ని నాన్న ఇటూ రా అని పిలిచే వారంట. దీన్ని బట్టి చూస్తే ఆ మహానేత తన కూతురు షర్మిలను,జగన్ ఎంతగా ప్రేమించేవారో అర్థమవుతుంది.
{youtube}TjzBfDWVcks{/youtube}
{loadmodule mod_sp_social,Follow Us}
Related