Saturday, May 18, 2024
- Advertisement -

నాడు జగన్‌కు.. నిన్న జయలలితకు… నేడు రేవంత్‌కు….

- Advertisement -

మళ్ళీ బెయిల్ కోసం పూజలు మొదలయ్యాయి. రాజకీయ నాయకులు అరెస్ట్ అయితే వాళ్ళ అభిమానులు, కార్యకర్తలు బెయిలు కోసం ప్రతి ఒక్క దేవుడికి పూజలు చేస్తారు.

ఒకప్పుడు వైసిపి నేత వైయస్ జగన్ అక్రమ ఆస్తుల కేసులో అరెస్ట్ అయి 16 నెలలు జైలులో ఉన్నారు. ఆప్పట్లో తమ నేతకు బెయిలు రావాలని అభిమానులు, పార్టీ కార్యకర్తలు పూజలు చేశారు. 

నిన్నటికి మొన్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు కూడా ఆమె అభిమానులు, కార్యకర్తలు బెయిల్‌‍ కోసం చేయని పూజ లేదు.  

ఇప్పుడు ఓటుకు నోటు కేసులో అరెస్ట్  అయిన రేవంత్ రెడ్డి కోసం మళ్ళీ పూజలు మొదలయ్యాయి. ఆయన అభిమానులు తమ నాయకునికి బెయిలు రావాలని పూజలు నిర్వహిస్తున్నారు. మరి ఈ పూజలకు దేవుడి కరుణించి రేవంత్ రెడ్డి కి బెయిల్ ఇస్తారేమో చుడాలి.  

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -