నంద్యాల పర్యటనలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించాయే అందరికి తెలిసిందే.ఇక టీడీపీ అన్న బాబుఅన్న వారి మీద వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా తన దైన శైలిలో బరస్ట్ అయ్యారు.
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.ప్రజలు కట్టే పన్నులతోనే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న విషయాన్ని చంద్రబాబు ప్రభుత్వం మర్చిపోతోందని విమర్శించారు.
{loadmodule mod_custom,GA1}
చంద్రబాబునాయుడు తన తండ్రి కర్జూరపునాయుడు ఆస్తితో ప్రజలకేమీ పెన్షన్లు ఇవ్వట్లేదు, రోడ్లు వేయడం లేదు. తన మామ ఎన్టీఆర్ ఆస్తితో ఏమీ రోడ్లు వేయట్లేదు. చంద్రబాబు, ఆయన కొడుకు అడ్డదిడ్డంగా సంపాదిస్తున్న డబ్బుతో ఈ రాష్ట్రానికి పెన్షన్ లు ఇవ్వట్లేదు, రోడ్లు వేయడం లేదు. ప్రజలు కట్టిన ట్యాక్సులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని విమర్శించారు.
పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజశేఖరరెడ్డిగారు కానీ, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రులు గానీ వేసిన రోడ్లపై మీరు ఏ విధంగా నడిచారు? వారిచ్చిన సబ్సిడీ గ్యాస్ ఏ విధంగా తీసుకున్నారు? మీ పార్టీ వాళ్లు మరి కాంగ్రెస్ ఇచ్చిన పెన్షన్లు కానీ, రేషన్లు కానీ ఎలా తీసుకున్నారు? అలాగైతే, మీకు ఎందుకు ఓట్లేశారు? మీరు పాదయాత్ర చేసింది కూడా రాజశేఖర్ రెడ్డి గారు వేసిన రోడ్ల మీద కాదాని ప్రశ్నించారు.రోజా అనింది నిజమేకదా…!
{loadmodule mod_custom,GA2}
{loadmodule mod_sp_social,Follow Us}
Also Read
- ప్రాణం ఉన్నంత వరకూ వైసీపిలోనే ఉంటా – ఎమ్మెల్యే రోజా
- రోజాలో మార్పు రాలేదా….? తీరుమార్చుకోకపోతే వేటు తప్పదా…?
- వారిద్దరి దూకుడు భవిష్యత్తులో వైసీపీకి ఇబ్బందిగా మారుతుందా….?
- చంద్రబాబుపై వైసీపీ ఫైర్బ్రాండ్ రోజా సంచలన సెటైర్లు..
{youtube}CGBlwCm9SLY{/youtube}