తెలుగు టీవీ సీరియల్ నటి నవ్యకు కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో బుల్లితెర రంగం షాక్ కు గురైంది. లాక్ డౌన్ తర్వాత షూటింగ్స్ కు అనుమతి ఇవ్వాలి అంటూ టాలీవుడ్ పెద్దలు సీఎం కేసీఆర్ ను కలిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోషల్ డిస్టెన్స్ షరతులతో సినిమా, సీరియల్స్ షూటింగ్ లకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ఈ నేపథ్యంలో కొన్ని సినిమా, సీరియల్ షూటింగ్స్ మొదలు అయ్యాయి. అయితే ఈ షూటింగ్ లపై కరోనా ప్రభావం చూపింది. ఇప్పటికే ఇద్దరు నటులకు కరోనా సోకింది. తాజాగా ఒక నటి కూడా కరోనా బారిన పడ్డారు. సీరియల్ నటి నవ్య స్వామికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. తెలంగాణ ప్రభుత్వం షూటింగులకు అనుమతించిన తర్వాత ఆమె షూటింగుల్లో పాల్గొన్నారు.
అందుతున్న సమాచారం ప్రకారం ఆమె ‘నా పేరు మీనాక్షి’ అనే సీరియల్ షూటింగ్ లో పాల్గొన్నారు. ప్రస్తుతం ఆమె హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. నవ్యకు కరోనా అని నిర్ధారణ కావడంతో యూనిట్ సభ్యులంతా ఆందోళనకు గురవుతున్నారు.
ఆమని మళ్లీ నటించడానికి కారణం ఏంటో తెలుసా ?
ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్ ‘సీటీమార్’