Wednesday, May 8, 2024
- Advertisement -

దశాబ్దాలు ఆర్టీసీ కార్మికుల కలనెరవేరింది…ఆర్టీసీ విలీనానికి లైన్ క్లియర్

- Advertisement -

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమైంది. దశాబ్దాలుగా ఆర్టీసీనీ ప్రభుత్వంలో విలీనం చేయాలని పోరాటాలు చేసిన కార్మికుల కల నెరవేరబోంతోంది.ర్టీసీ విలీన అంశంపై నియమించిన ఆంజనేయ రెడ్డి కమిటీ సీఎం వైఎస్ జగన్‌కు మధ్యంతర నివేదికను సమర్పించింది. ఇందులో ఆర్టీసీని విలీనం చేయాలని సిఫారసు చేశారు. సీఎం జగన్… ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.ఆర్టీసీ విలీనానికి కేబినెట్ ఇప్పటికే సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం లాంఛనమే కానుంది.

కమిటీ నివేదిక ఇచ్చిన అనంతరం రవాణాశాఖ మంత్రి పేర్ని నాని, ఆర్థిక మంత్రి బుగ్గన, ఆర్టీసీ, రవాణా అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.దశాబ్దాల ఆర్టీసీ ఉద్యోగుల కలను సీఎం జగన్ నెరవేర్చబోతున్నట్టు వెల్లడించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయబోతున్నారని… ఇందుకు సంబంధించిన రేపు నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.ప్రభుత్వంలో కొత్తగా ప్రజారవాణా విభాగం ఏర్పాటు చేస్తామని… ఆర్టీసీ ఉద్యోగులను ఈ విభాగంలోకి తీసుకుంటామని వివరించారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి విధి విధానాలు ప్రకటిస్తామని అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -