ఏపీ మాజీ గవర్నర్ ఎన్డీ తివారీ కుమారుడు రోహిత్ మృతి కేసు మరో మలుపు తిరిగింది. ముక్కలోంచి రక్తం కారుతుండటంతో ఆస్పత్రికి తరలించే క్రమంలో మంగళవారం రోహిత్ మృతి చెందిన విషయం తెలిసిందే. రోహిత్ తల్లి సాధారణ చెకప్ల నిమిత్తం ఆస్పత్రికి వెళ్లిన క్రమంలో రోహిత్ ఆకస్మికంగా అనారోగ్యానికి గురికావడాన్ని ఇంట్లో పనిచేస్తున్న వ్యక్తులు గుర్తించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేశారు. ఇందులో భాగంగా ఫోరెన్సిక్, క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రోహిత్ నివాసానికి వెళ్లి కీలక సాక్ష్యాలు సేకరించారు.
అయితే ఢిల్లీలోని ఎయిమ్స్ డాక్టర్లు విడుదల చేసిన పోస్టుమార్టం రిపోర్టులో సంచలన నిజాలు బయటపడ్డాయి.మృతుడు రోహిత్ తివారీని ఎవరో హత్య చేసినట్లు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడయ్యింది.ఇదిలా ఉంటే రోహిత్ను ఎవరో బలంగా ఊపిరి ఆడకుండా చేసి, హత్య చేసి ఉంటారని రిపోర్టులో బయటపడింది. దీంతో కేసును క్రైమ్ బ్రాంచీకి ట్రాన్స్ఫర్ చేశారు.హత్య జరిగిందని రిపోర్టులో పేర్కొనడంతో ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రోహిత్ శేఖర్ కుటుంబీకులను, సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు.