ఉత్తరాఖండ్ గవర్నర్ బేబీ రాణి మౌర్య కొవిడ్ బారిన పడ్డారు. సోమవారం నిర్వహించిన పరీక్షలో ఆమెకు పాజిటివ్గా తేలింది. ఆమె ఈ విషయాన్ని తెలిపారు. తనను కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరారు.
వారం రోజుల పాటు ఆగ్రా పర్యటనకు వెళ్లిన గవర్నర్ బేబీ రాణి మౌర్య.. ఉత్తరాఖండ్కు శుక్రవారమే తిరిగి వచ్చారని రాజ్ భవన్ వెల్లడించింది. శని, ఆదివారం సెలవులు కాగా రాజ్భవన్ కార్యాలయం మూసి ఉంది. అధికారులు, ఉద్యోగులను గవర్నర్ కలవనందున.. గవర్నర్ సచివాలయ కార్యకలపాలు యథావిధిగా జరగనున్నాయి.
ఒడిశా గవర్నర్ గణేశీ లాల్ భార్య సుశీలా దేవి కరోనా బారిన పడి మృతి చెందారు. నవంబర్ 1న గవర్నర్ కటుంబ సభ్యులకు సోకగా భువనేశ్వర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం రాత్రి సుశీలా దేవి ఆరోగ్య పరిస్థితి విషమించగా కన్నుమూశారు.
జ్యోతిష్కుడు చావుకి వంద కారణాలు..!
ట్రంప్ పిల్లాడు.. బైడెన్ యమ డేంజర్..!