చెంగల్పట్టు జిల్లా పెరియాపుదుర్కు చెందిన దామోదరన్.. జ్యోతిష్కుడుగా పని చేస్తూ పొట్ట నింపుకునేవాడు. ఆరేళ్ల క్రితమే అతడి భార్య మృతి చెందింది. అప్పటినుంచి తన సహాయకురాలైన రాజేశ్వరి అనే మహిళతో అతడు సహజీవనం చేస్తున్నాడు. నాలుగురోజులుగా తమ ఇంటి చుట్టు పక్కన ఉన్న పిల్లలను పిలిచి తమ కోసం ఆహారాన్ని కొనుక్కురావాల్సిందిగా రాజేశ్వరి అడుగుతూ ఉంది. దామోదరన్ గురించి చుట్టుపక్కల ఇళ్ల వారు అడిగితే..’ఆసుపత్రికి వెళ్లాడు, పట్టణానికి వెళ్లాడు’ అని పొంతన లేని సమాధానం చెబుతూ ఉండేది.
అయితే.. దామోదరన్ ఇంటిలో నుంచి ఆదివారం.. దుర్వాసన వ్యాపించింది. అనుమానంతో ఆ ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు ఇరుగుపొరుగువారు. ఈ క్రమంలో వారిని రాజేశ్వరి అడ్డుకుని, కత్తితో దాడి చేసేందుకు యత్నించింది. కానీ, ఆమెను తప్పించి ఇంట్లోకి వెళ్లి చూడగా అసలు విషయం బయటపడింది. కుళ్లిపోయిన స్థితిలో దామోదరన్ మృతదేహం కనిపించింది. ఇంటినిండా పురుగులు తిరుగుతున్నాయి. వెంటనే వారు గ్రామాధికారులకు సమాచారం అందించారు.
కరోనాతో ఒడిశా ప్రథమ మహిళ మృతి..!